ఇస్లాంపూర్లోని ఆటోమొబైల్ ఇంజినీరింగ్ బ్రాంచ్కు చెందిన విద్యార్థులు సౌరభ్ భోంస్లే, ఆకాష్ కదమ్, నిఖిల్ టిపాయ్లే, ఆకాశ్ గైక్వాడ్, ఓంకార్ మీర్జాకర్ ఓ అద్భుతం ఆవిష్కరించారు. ఎడ్లబండిని లాగే ఎడ్లమీద భారాన్ని తగ్గిస్తూ రోలింగ్ సపోర్ట్ ఏర్పాటు చేశారు. ఎడ్లబండికు ముందు భాగంలో ఓ చక్రాన్ని అమర్చారు. దీంతో బండిని తేలిగ్గా ముందుకు కదులుతుంది. వాళ్లంతా రైతు కుటుంబాలకు చెందిన వాళ్లు కావడం విశేషం. ఎడ్లను కుటుంబసభ్యులుగా భావిస్తూ పెరిగిన వాళ్లు కనుకే వాళ్లకు అలాంటి ఆలోచన వచ్చిందని చెప్పవచ్చు. విద్యార్థుల ఆలోచన, వారి కృషిని అందరూ అభినందిస్తున్నారు. అందుకు సంబంధించిన ఫొటో సోషల్మీడియాలో వైరల్ అవుతోంది.