తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే భక్తుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. వేసవి సెలవులు పూర్తి అవుతున్న వేళ.. చాలా ప్రవేశ పరీక్షల ఫలితాలు వస్తూ ఉంటాయి. దీంతో కుటుంబాలతో సహా వచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామికి మొక్కులు చెల్లిస్తూ ఉంటారు. గత వారం పది రోజులుగా శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య విస్తారంగా పెరుగుతుంది దీంతో క్యూ కాంప్లెక్స్ లన్ని భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
ఇదే సమయంలో శ్రీనివాసుడిని దర్శించుకునేందుకు దగ్గర మార్గాలను యాత్రికులు వెతుకుతున్నారు. ఈ క్రమంలో శ్రీవారి మెట్టు ద్వారా దర్శనం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాస్తవానికి తిరుమల కొండ మీదకు వెళ్లేందుకు ఘాట్ రోడ్డు మీదుగా వాహనాల్లో భక్తులు వెళుతూ ఉంటారు. కానీ శ్రీవారికి మొక్కుకున్న భక్తులు మాత్రం అలిపిరి మెట్ల ద్వారా కానీ శ్రీవారి మెట్టు ద్వారా కానీ కాలినడకన ఏడుకొండలు ఎక్కి దర్శనం చేసుకుంటారు. ఎన్నో కష్టాలకు ఓర్చి కాలినడకన వచ్చే భక్తుల కోసం టీటీడీ కొన్ని వ్యసులు బాట్లు కల్పించింది . ఇందులో భాగంగా అలిపిరి మెట్ల ద్వారా కానీ శ్రీవారి మెట్టు ద్వారా కానీ కాలినడకన ప్రయాణం చేసినట్లయితే.. ఆ మధ్య మార్గంలో యాత్రికులకు టోకెన్ వేస్తారు ఈ టోకెన్ కలిగిన భక్తులు నేరుగా క్యూ కాంప్లెక్స్ కు చేరుకుని రెండు మూడు గంటల్లోనే దర్శనం చేసుకుని బయటకు రావచ్చు.
కానీ ఇటీవల కాలంలో చిరుతపులుల భయంతో ఈ టోకెన్లు వేసే కౌంటర్లను కొండ దిగువకు మార్చారు. దీంతో నడక మార్గం మొదట్లోనే టోకెన్లు వేయడం జరుగుతోంది.
కానీ కొందరు యాత్రికులు ఈ టోకెన్లు వేయించుకొని తిరిగి ఘాట్ రోడ్లో ప్రయాణం చేసి కొండమీదకి వెళుతున్నారు అని ఫిర్యాదులు అందుతున్నాయి. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని ప్రతీరోజూ వేలాది మంది దర్శించుకుంటారు.. ఇక, ఏదైనా ప్రత్యేకమైన రోజు వచ్చినా.. శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నా తిరుమల గిరులు భక్తులతో కిక్కిరిసిపోతాయి.. మరోవైపు.. ప్రతీరోజూ వేలాది మంది నడక మార్గంలో తిరుమల వెళ్తుంటారు.. శ్రీవారిని దర్శించుకుంటున్నారు. దీంతో నడక మార్గం టోకెన్లు దుర్వినియోగం కాకుండా ఉండేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది. శ్రీవారి మెట్టు నడకమార్గంలో భక్తులకు జారి చేసే టోకేన్ల స్కానింగ్ పున:ప్రారంభించాలని టీటీడీ నిర్ణయించింది. నడకమార్గంలో భక్తులుకు జారి చేసే టోకేన్లు 1200 మెట్టు వద్ద స్కాన్ చేసిన తర్వాతే దర్శనానికి అనుమతించనుంది. గతంలో నడకమార్గంలో చిరుత దాడుల ఘటనతో టోకేన్ జారి విధానంలో మార్పులు చేశారు అధికారులు.. దీంతో, స్కానింగ్ విధానం లేకపోవడంతో నడకదారి భక్తులకు జారి చేసే టోకేన్లు పక్కదారి పడుతున్నాయని టీటీడీ కొత్త ఈవో శ్యామలరావు దృష్టికి తీసుకెళ్లారు విజిలెన్స్ అధికారులు.. ఈ నేపథ్యంలో తిరిగి పూర్వపు విధానాని కోనసాగించాలని అధికారులను ఆదేశించారు.
మొత్తం మీద కాలినడకన వెళ్లే భక్తులకు ఈ టోకెన్లు యధావిధిగా అందుతాయి. అయితే ఈ టోకెన్లను కాలినడక మార్గం మధ్యలో మరొకసారి స్కానింగ్ చేయడం ద్వారా ఈ విధానం మరింత పటిష్టంగా అమలు అవుతుందని అధికారులు చెబుతున్నారు.