ఆంధ్రప్రదేశ్ కొత్త మంత్రి వర్గం కొలువుతీరింది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ఆయనతోపాటు మరో 24 మందికి అవకాశం కల్పించారు. ఇందులో జనసేన పార్టీ నుంచి ముగ్గురికి బిజెపి నుంచి ఒకరికి అవకాశం ఇచ్చారు. రాత్రి బాగా పొద్దుపోయేదాకా తీవ్ర వడపోతలు జరిగాక జాబితా వెలువడింది. మొత్తం 24 మందిలో 17 మంది కొత్త మంత్రులు కావడం విశేషం.
గత మంత్రివర్గంలో పనిచేసిన వారిలో నారా లోకేష్ పి నారాయణ అచ్చం నాయుడు కొల్లు రవీంద్ర వంటి వారికి మాత్రమే అవకాశం దక్కింది. మరోవైపు జనసేన నుంచి ఊహించినట్లుగానే పవన్ కళ్యాణ్ నాదెండ్ల మనోహర్ మంత్రివర్గంలో ప్రవేశించారు. వీరితోపాటు గోదావరి జిల్లాల నుంచి కందుల దుర్గేష్ కు అవకాశం ఇచ్చారు. బిజెపి నుంచి పార్టీ ప్రధాన కార్యదర్శిగా సేవలందించిన సత్య కుమార్ కు మంత్రి పదవి కల్పించారు. దగ్గుపాటి పురంధేశ్వరి ని పార్టీ అధ్యక్షులు చేయడంలో .. అప్పట్లో ఆయన ఢిల్లీలో చక్రం తిప్పారు దీనికి ప్రతిఫలంగా బిజెపి నుంచి సత్య కుమార్ పేరును పురందేశ్వరి ప్రతిపాదించారని చెబుతున్నారు.
మొత్తం మంత్రుల వివరాలు చూస్తే ఇలా ఉన్నాయి…
1. నారా చంద్రబాబు నాయుడు
2. కొణిదెల పవన్ కళ్యాణ్
3. కింజరాపు అచ్చెన్నాయుడు
4. కొల్లు రవీంద్ర
5. నాదెండ్ల మనోహర్
6. పి.నారాయణ
7. వంగలపూడి అనిత
8. సత్యకుమార్ యాదవ్
9. నిమ్మల రామానాయుడు
10. ఎన్.ఎమ్.డి.ఫరూక్
11. ఆనం రామనారాయణరెడ్డి
12. పయ్యావుల కేశవ్
13. అనగాని సత్యప్రసాద్
14. కొలుసు పార్థసారధి
15. డోలా బాలవీరాంజనేయస్వామి
16. గొట్టిపాటి రవి
17. కందుల దుర్గేష్
18. గుమ్మడి సంధ్యారాణి
19. బీసీ జనార్థన్ రెడ్డి
20. టీజీ భరత్
21. ఎస్.సవిత
22. వాసంశెట్టి సుభాష్
23. కొండపల్లి శ్రీనివాస్
24. మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి
25. నారా లోకేష్