డిల్లీ సర్కారు కొత్త పాలసీ తీసుకురావడంతో తీవ్ర మద్యం కొరత ఏర్పడింది. జులై 31వ తేదీతో ఎక్సైజ్ లైసెన్సుల గడవు తీరడంతో ఆగస్టు 1వ తేదీ నుంచి కొత్త ఎక్సైజ్ పాలసీని అమలు చేయాలని ఢిల్లీ సర్కారు నిర్ణయించింది. దీంతో 468 ప్రైవేట్ మద్యం దుకాణాలను మూసివేశారు. దీంతో మద్యం కొరత వల్ల మందుప్రియులు ఆందోళన చెందుతున్నారు. ఇక మద్యం పాలసీతో … గడువు కూడా ముగుస్తున్న వేళ రెండు రోజులుగా తమ మధ్య ఉన్న మద్యం నిల్వలు విక్రయించేందుకు దుకాణాల యజమానులు భారీ డిస్కౌంట్లు ఇచ్చారు. ఒకటి కొంటే ఒకటి ఉచితం అంటూ ఆఫర్ ఇచ్చారు. కొందరైతే ఒకటి కొంటే రెండు బాటిళ్లు ఉచితంగా ఇచ్చారు. దీంతో నిన్నామొన్న బార్ షాపుల్లో బారులుగా కనిపించారు జనం.
కొత్త ఎక్సైజ్ పాలసీలో భాగంగా ప్రభుత్వం ఆధ్వర్యంలోని మద్యం స్టోర్లలోనే మద్యాన్ని విక్రయిస్తామని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ప్రకటించారు. కొత్తగా ప్రభుత్వ మద్యం దుకాణాలు ప్రారంభించే వరకు అక్రమ మద్యాన్ని విక్రయించకుండా చర్యలు తీసుకోవాలని ఢిల్లీ సర్కారు చీఫ్ సెక్రటరీని ఆదేశించింది. మద్యం సరఫరాలో లోపాలను సవరిస్తూ సీబీఐ దర్యాప్తులో చేసిన సిఫార్సుల మేరకు ఢిల్లీ ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ పాలసీని రూపొందించింది.