సోషల్ మీడియాకు కళ్లెం వేసేందుకు కేంద్ర కసరత్తులు.. కొత్త చట్టం రెడీ అవుతోందట..!
ప్రస్తుతం సమాజంపై సోషల్ మీడియా ప్రభావం విపరీతంగా పెరిగిపోయింది. సోషల్ మీడియా ద్వారా ఉపయోగం ఎంత ఉందో.. అంతకంటే దుర్వినియోగం కూడా అంతే ఉంది. నిజం ఎంటో అన్నది తెలిసే లోపే.. సోషల్ మీడియాలో అబద్ధం అంత త్వరగా ప్రచారం అయిపోతోంది. అంతేకాదు.. చిన్న చిన్న విషయాలు అయితే సరే. కానీ దేశ ప్రయోజనాలకు సంబంధించిన విషయాల్లో కూడా తప్పుడు సమాచారాన్ని వైరల్ చేస్తున్నారు కొందరు సంఘ విద్రోహ శక్తులు. దీంతో ఈ తప్పుడు ప్రచారం ప్రభావం సామాన్య ప్రజానికంపై పడుతోంది. ఈ క్రమంలో సోషల్ మీడియాకు కళ్లెం వేసేందుకు కేంద్ర ప్రభుత్వం రెడీ అవుతోంది. సోషల్ మీడియాను నియంత్రించేందుకు కొత్త చట్టాన్ని తీసుకొచ్చేందుకు కసరత్తులు చేస్తోంది. ఈ విషయాన్ని బీజేపీ సీనియర్ నేత రాం మాధవ్ తెలిపారు. ఈ సోషల్ మీడియ ప్రజాస్వామ్యాన్ని బలహీనం చేసి, అరచకానికి దారి తీసేలా చేస్తుందని అభిప్రాయపడ్డారు. దీనిని నియంత్రించడానికి ప్రస్తుతం ఉన్న చట్టాలు సరిపోవడం లేదని.. అందుకే కొత్త చట్టాలను తీసుకువచ్చే పనిలో కేంద్రం ఉందని రాంమాధవ్ వెల్లడించారు. తన కొత్త పుస్తకం‘బికాజ్ ఇండియా కమ్స్ ఫస్ట్’ ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు.