జమ్ముకశ్మీర్ అభివృద్ధిపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది.
ముఖ్యంగా రహదారులను అభివృద్ధి చేస్తున్నారు.
11,721 కోట్ల నిధుల్ని వెచ్చిస్తున్నారు. 259 కి.మీ పొడవు కలిగిన 25 నూతన జాతీయ రహదారి ప్రాజెక్టులకు కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేశారు.
ఈ రోడ్డు ప్రాజెక్టుల నిర్మాణం వల్ల సమయం, ఇంధనం ఆదా అవుతుందని కేంద్రం అంటోంది. జమ్మూ కశ్మీర్లో కొత్త ఉపాధి అవకాశాల సృష్టి జరుగుతుందని ఈ ప్రాంత పర్యాటకం మరింతగా అభివృద్ధి చెంది ప్రజల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతాయని ఈ సందర్భంగా గడ్కరీ అన్నారు. . ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం జమ్మూ కశ్మీర్ సర్వతోముఖాభివృద్ధికై నిరంతరం శ్రమిస్తోందనీ ఆయన గుర్తుచేశారు.