ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవ్ బా మూడు రోజుల భారత్ పర్యటన నిమిత్తం న్యూఢిల్లీ చేరుకున్నారు. దేవ్ బా తో పాటు ఆయన సతీమణి డాక్టర్ అర్జు దేవ్ బా సహా ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం ఉంది. గతేడాది జులైలో పదవీబాధ్యతలు స్వీకరించినన తరువాత విదేశీ పర్యటన చేపట్టడం ఇదే మొదటిసారి. ఆయన రేపు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతోనూ, ప్రధాని మోదీతోనూ చర్చలు జరపనున్నారు.
విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ మరియు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా నేపాల్ ప్రధానిని కలవనున్నారు. న్యూఢిల్లీలో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు …ఉత్తరప్రదేశ్లోని వారణాశని నేపాల్ ప్రధాని దంపతులు సందర్శించనున్నారు. నేపాల్- భారత్ మధ్య ప్రత్యేక స్నేహసంబంధాలున్నాయి. ఇటీవల అన్నిరంగాల్లోనూ ఇరుదేశాలు పరస్పర సహకారం, భాగస్వామ్యంతో గణనీయమైన అభివృద్ధిని సాధించాయి.
https://twitter.com/MEAIndia/status/1509836933656375299?s=20&t=cP1lcfwTGJDXp_5prjp0IA
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)