భారత రెస్క్యూ టీం సహకారంతో 533 మంది నేపాలీలు ఉక్రెయిన్ నుంచి బయటపడ్డారు. తమ పౌరులకు సాయం చేసి భద్రంగా దేశం చేరడంలో సహకరించిన భారత్ కు కృతజ్ఞతలు తెలిపారు నేపాల్ విదేశాంగ మంత్రి నారాయణ్ ఖడ్కా. ఉక్రెయిన్ వీడిన వారిలో 427 మంది నేపాలీలు పోలండ్ కు చేరుకున్నారు. మిగతావాళ్లు ఇతర పొరుగు దేశాల్లో ఉన్నారు. అయితే వారంతా కూడా సురక్షితంగా ఉన్నారని నేపాల్ అధికారికంగా ప్రకటించింది. వాళ్లను సురక్షితం స్వదేశం చేర్చే ప్రక్రియలో సహకరించిన భారత ప్రభుత్వానికి ఖడ్కా ధన్యవాదాలు తెలిపారు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)