భూటాన్, సింగపూర్ సహా UAE తరువాత నేపాల్ ఇటీవల భారతీయ రూపే కార్డ్ను ఉపయోగిస్తున్న నాలుగో విదేశీ దేశంగా అవతరించింది. PTI ప్రకారం, నేపాల్లో భారత ఎలక్ట్రానిక్ చెల్లింపు వ్యవస్థను ప్రారంభించాలని ప్రధాని నరేంద్ర మోదీ, నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవుబా మధ్య జరిగిన ఇటీవల జరిగిన చర్చలలో నిర్ణయం తీసుకున్నారు. చర్చల సందర్భంగా ఇరువురు నేతలు వాణిజ్యం, ఇంధనం, వాణిజ్య రంగాల్లో సహకారం సహా పలు అంశాలపై చర్చించారు. ద్వైపాక్షిక పర్యటనలో భాగంగా భారత్ వచ్చారు దేవ్ బా.
“నేపాల్లో రూపే కార్డును ప్రవేశపెట్టడం అనేది ఇరు దేశాల ఆర్థిక కనెక్టివిటీకి కొత్త అధ్యాయాన్ని జోడిస్తుంది’’ అని మోదీ అన్నారు.నేపాల్లో రూపే కార్డ్ను ప్రారంభించడం ఆర్థిక అనుసంధానంలో సహకారం కల్పిస్తుంది. ద్వైపాక్షిక పర్యాటక ప్రవాహాన్ని సులభతరం చేస్తుంది. ప్రజల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని భావిస్తున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) తెలిపింది.
దేశీయ, బహుపాక్షిక చెల్లింపుల వ్యవస్థను కలిగి ఉండాలనే RBI దృష్టిలో రూపే కార్డ్ పథకం 2012లో ప్రవేశపెట్టబడింది.
మోదీ-దేవుబా చర్చల తరువాత ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL), నేపాల్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (NOC) మధ్య ఐదు సంవత్సరాల కాలానికి పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా కోసం ఒక అవగాహన ఒప్పందాన్ని పునరుద్ధరించడానికి భారత్, నేపాల్ ఒక ఒప్పందంపై సంతకం చేశాయి.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)