వారంరోజులుగా వార్తల్లో నిలిచిన నెల్లూరుకు చెందిన రిటైర్డ్ హెడ్ మాస్టర్ కోటయ్య చనిపోయారు. పది రోజుల క్రితం నెల్లూరు జీజీహెచ్ కోటయ్య చేరారు. 4 రోజులుగా వెంటిలేటర్ చికిత్స పొందుతున్న ఆయన సోమవారం మరణించారు. కోటయ్య ప్రకటనతోనే ఆనందయ్య మందు వెలుగులోకి వచ్చింది. కరోనా తీవ్రం అవడంతో ఆయన ఆనందయ్య మందు తీసుకున్నారు. ఆ మందుతో కోలుకున్నారు కూడా. తరువాత ఆయన పరిస్థితి క్రమంగా విషమించి.. తర్వాత ఆక్సిజన్ స్థాయిలు పడిపోయాయి.చికిత్స పొందుతూ ఆయన చనిపోయారు