మాజీ ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ ప్రేమాయణం మీద మరోసారి వివాదం రాజుకొంటోంది. అప్పట్లో భారత్ కు చివరి వైస్రాయి గా ఉన్న మౌంట్ బాటన్ భార్య లేడీ మౌంట్ బాటన్ తో నెహ్రూ ప్రేమ కథలు, రాసలీలలు నడిపారు అని ఆరోపణలు ఉన్నాయి. అందుకే బ్రిటీష్ వారికి అనుగుణంగా దేశ విభజన కు అంగీకరించారు అన్నది బలమైన వాదన. ఈ విషయం మీద పార్లమెంటు వేదికగా ఆరోపణలు గుప్పుమన్నాయి.
…
ఈ వివాదం రాజుకోవటానికి అసలు కారణం వేరేగా కనిపిస్తోంది. అప్పట్లో జవహర్ లాల్ నెహ్రూ రాసిన లేఖలు, ఆయనకు అందిన సమాచార పత్రాలు ఇప్పుడు మాయం అయ్యాయి. ఈ లెటర్స్ , పత్రాలలోనే నెహ్రూ కి అనేక మంది మహిళలతో ఉన్న సంబంధాల గురించిన వివరాలు ఉన్నాయి అని చెబుతారు. అందుకే ఒక రకంగా చెప్పాలంటే వీటిలో .. నెహ్రూ గారి ప్రేమలేఖలు కూడా ఉన్నాయని అంటారు. ఇవన్నీ రహస్య పత్రాలుగా భారత ప్రభుత్వం దాచి పెట్టి ఉంచింది. చాలా కాలం కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉండటంతో ఇవేమీ బయటకు రాలేదు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, వీటి గురించి ఆరా తీస్తే మరో షాకింగ్ న్యూస్ బయట పడింది.
యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పడు ఈ పత్రాలు అన్నింటినీ… సోనియాగాంధీ ఇంటికి గుట్టుచప్పుడు కాకుండా తరలించేశారుట. ఈ పత్రాలను తిరిగి అప్పగించాలని కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీని ప్రధానమంత్రుల మ్యూజియం, గ్రంథాలయం కోరుతోంది. ఈ మేరకు సెప్టెంబర్లో సోనియా గాంధీకి, ఈ నెల 10న రాహుల్ గాంధీకి గ్రంథాలయం అధికారులు లేఖలు రాస్తున్నారు. నెహ్రూకు చెందిన లేఖలు, పత్రాలలను తిరిగి అప్పగించాలని లేదా జిరాక్స్లు కానీ, స్కాన్డ్ కాపీలు కానీ ఇవ్వాలని కోరుతున్నారు. ఈ పత్రాలను తిరిగి అప్పగించేస్తే… చరిత్ర పరిశోధకులకు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. కాగా, రిజ్వాన్ లేఖపై సోనియా, రాహుల్ నుంచి స్పందన రాలేదని తెలుస్తున్నది.
మొత్తం 50 డబ్బాలకు పైగా నెహ్రూ లేఖలు, పత్రాలను అప్పట్లో భద్రపరిచారు. తర్వాత ఈ డబ్బాలను ప్రధానమంత్రి కార్యాలయం లైబ్రరీకి తరలించారు. అకస్కాత్తుగా సోనియాగాంధీ జోక్యంతో ఇవన్నీ మాయం అయ్యాయి. వీటిని సోనియా ఇంటికి సీక్రెట్ గా తరలించేశారు అని చెబుతున్నారు. ప్రభుత్వానికి సంబంధించిన పత్రాలను వెనక్కి తిరిగి ఇవ్వాలని ప్రధానమంత్రి కార్యాలయం కోరుతున్నప్పటికీ,.. ఏమాత్రం స్పందన లేదు అంటే వివాదాస్పద రహస్యాలు అందులో ఉన్నాయి అన్న వాదన వినిపిస్తోంది. అందుచేతనే సోనియాగాంధీ, రాహుల్ గాంధీ మౌనం పాటిస్తున్నారు అని చెబుతున్నారు
నెహ్రూ లేఖలను దాచేందుకు గాంధీ కుటుంబం ఎందుకు ప్రయత్నిస్తున్నదో దేశానికి తెలియాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఇవేమీ వ్యక్తిగత ఆస్తులు కాదని, దేశానికి చెందిన చారిత్రక పత్రాలని ఆయన అన్నారు. ఈ సందర్బంగా.. మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆత్మకథ నుంచి కొంత భాగాన్ని సైతం బీజేపీ నేతలు ఉదహరిస్తున్నారు. . ‘నెహ్రూను లార్డ్ మౌంట్బాటన్ బాగా ఆకట్టుకున్నాడు. బహుశా లేడీ మౌంట్బాటన్ ప్రభావం అంతకంటే ఎక్కువే ఉండొచ్చు’ అని అందులో రాసి ఉంది. తద్వారా నెహ్రూ, ఎడ్వినా మౌంట్బాటన్ మధ్య సంబంధాన్ని బీజేపీ మరోసారి తెర మీదకు తెస్తున్నది.