గతేడాది పంజాబ్ లో ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా భద్రతా ఉల్లంఘన ఘటనలో మాజీ డీజీపీ ఎస్ చటోపాధ్యాయ సహా మరో ఇద్దరు పోలీసు అధికారులపై క్రమశిక్షణా చర్యలకు సీఎం భగవంత్ మాన్ ఆదేశించారు. చటోపాధ్యాయతో పాటు, ఫిరోజ్పూర్ రేంజ్ పోలీసు డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (డిఐజి) ఇందర్బీర్ సింగ్, అప్పటి సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్ఎస్పి) హర్మన్దీప్ సింగ్ పై క్రమశిక్షణా చర్యలకు ఆదేశించారు.
గతేడాది మోదీ రాష్ట్ర పర్యటన సందర్భంగా పంజాబ్ పోలీసులు ప్రొటోకాల్ ప్రకారం సరైన భద్రత కల్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఆయన కాన్వాయి ఓ వంతెనమీదుగా వెళ్తుండగా నిరసనకారులు కొందరు చుట్టుముట్టారు.అయితే సెక్యూరిటీ వైఫల్యం కాదని మోదీనే కావాలనే నాటాకాలాడారని ప్రత్యర్థులు హడావుడి చేశారు.ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న కేంద్ర హోంశాఖ విచారణకు ఆదేశించగా… సుప్రీం నిలిపేసింది. జస్టిస్ ఇందు మల్హోత్రా నేతృత్వంలో ఓ కమిటీని వేసి విచారణకు ఆదేశించింది. విచారణ జరిపిన కమిటీ నివేదికను సమర్పించింది. ఆ రోజు డ్యూటీలో ఉన్న పోలీసు అధికారులు విధినిర్వహణలో నిర్లక్ష్యం వహించారని, వారిపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. కమిటీ ఆదేశాలతో పంజాబ్ సర్కారు…నాటి పంజాబ్ డిజీపీ సిద్దార్ధ చటోపాధ్యాయ్ ని, DIG ఇందర్ బీర్ సింగ్ ని, ఫిరోజ్ పూర్ SSP, హరమందీప్ సింగ్ పై కఠిన మైన క్రమశిక్షణా చర్యలు తీసుకోమని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు
అలాగే ఆ రోజు విధి నిర్వహణ లో వైఫల్యం చెందిన AGDP లా అండ్ ఆర్డర్, AGDP సైబర్ క్రైమ్, పాటియాల రేంజి ఐజీపీ, కౌంటర్ ఇంటెలిజెన్స్ ఐజి ఇంకా పలువులు. పోలీసు, సివిల్ అధికారులకు నోటీసులు జారీ చేశారు.
CM Mann to take action against ex-Punjab DGP, other cops over PM's security breach
Read @ANI Story | https://t.co/qCbnKCg8nO#CMBhagwantMann #Punjab #PMSecurityBreach pic.twitter.com/sNHsEtG3Zo
— ANI Digital (@ani_digital) March 21, 2023