ఏడాది ఎన్నికల్లో తెలంగాణ అంతట 17 పార్లమెంటు స్థానాల కోసం పోలింగ్ జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్లోని 25 లోక్ సభ నియోజకవర్గాల కోసం పోలింగ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఐదేళ్ల పదవీకాలం పూర్తవడంతో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగాయి 175 స్థానాల్లో ఒకేరోజు పోలింగ్ జరిగింది.
శనివారం సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ లో రెండు తెలుగు రాష్ట్రాల్లో సాగినట్లు తెలుస్తోంది. తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాల్లో ఏ పార్టీ మెజార్టీ స్థానాలు దక్కించుకుంటుందో .. అంచనా ఫలితాలను వెల్లడించాయి. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ 8 స్థానాలు దక్కించుకుంటుందని అంచనా వేయగా..బీజేపీ 7 చోట్ల విజయం సాధిస్తుందని అంచనా వేశాయి. . ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కేవలం ఒక్క సీటుకే పరిమితం అవుతోందని వెల్లడించింది. ఎంఐఎం తన సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకుంటుందని తెలిపింది.
ఇదిలా ఉంటే ఆరా సంస్థ సైతం ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెల్లడించింది. బీజేపీ 8-9 సీట్లు, కాంగ్రెస్ 7-8, ఎంఐఎం 1, బీఆర్ఎస్కు ఒక్క ఎంపీ సీటు కూడా అంచనా వేసింది.
మరోవైపు ఆంధ్రప్రదేశ్లో చాలా మీడియా సంస్థలు తెలుగుదేశం కూటమికే అధికారం దక్కుతుందని అంచనా వేస్తున్నాయి. ఈ సర్వే లనే ప్రధాన మీడియా సంస్థలు ఎక్కువగా ప్రసారం చేస్తున్నాయి. మరోవైపు కొన్ని సంస్థలు మాత్రం వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నాయి.
పీపుల్స్ పల్స్టీటీ డీపీ 95-110వైసీపీ 45-60జనసేన 14-20బీజేపీ 2-5
చాణక్య స్ట్రాటజీస్ టీడీపీ కూటమికి 114-125 సీట్లు అంచనా వేయగా,
వైసీపీ కి 39-49 వస్తాయని లెక్క తేల్చింది. పయనీర్ గ్రూప్ టీడీపీ కూటమికి 144, వైసీపీ 31 అంచనా వేస్తుంది. మరోవైపు ఆరా, ఆత్మసాక్షి వంటి సంస్థలు.. వైసిపికి వందకు పైగా సీట్లు వస్తాయి అని, టిడిపి కూటమి 60 70 సీట్లకు పరిమితం అవుతుందని లెక్కవేస్తున్నాయి.
మొత్తం మీద జూన్ 4వ తేదీ ఫలితాలు వచ్చేదాకా వేచి చూడాల్సిందే