రాష్ట్రపతి , ఉపరాష్ట్రపతి ఎన్నికల వేళ దేశరాజధానిలో సందడి నెలకొంది. రాష్ట్రపతి ఎన్నిక ఇవాళే కాగా మరికొన్ని రోజుల్లోనే ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో అధికార ఎన్డీఏ అభ్యర్థి జగదీప్ ధన్కడ్ ఇవాళ నామినేషన్ వేశారు. ప్రధాని మోదీ, రక్షణమంత్రి రాజ్ నాథ్, హోంమంత్రి అమిత్షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సహా పలువురు ఆయన నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఓ సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన తనకు ఇంత గొప్ప అవకాశం రావడం ప్రజాస్వామ్య గొప్పదనమని ఆయన అన్నారు. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా నక్వీ, వెంకయ్య తో పాటు మరికొందరి పేర్లు ప్రచారంలోకి వచ్చినా అనూహ్యంగా జగదీప్ పేరును ప్రకటించారు. పశ్చిమబెంగాల్ గవర్నర్ గా ఉన్న ఆయనకు ఈ అవకాశం ఇవ్వడం వెనక జాట్ సామాజికవర్గంతో పాటు సాగుచట్టాల కారణంగా దూరమైన రైతులను చేరువ చేసుకోవాలనే వ్యాహం ఉందని చెబుతున్నారు. ఇక విపక్షాల తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా కర్నాటకకు చెందిన మార్గరెట్ అల్వా బరిలో ఉన్నారు.
https://twitter.com/narendramodi/status/1548956808764465152?s=20&t=7-nS26G9yH2Upf1EhMztXQ