మహారాష్ట్రలో రాజకీయ సాక్సోభం కారణంగా సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఉద్వేగభరితమైన ప్రసంగం చేసిన విషయం తెలిసిందే. ఉద్దవ్ వ్యాఖ్యలపై అసమ్మతి నేత ఏక్నాథ్ షిండే ట్విట్టర్ లో స్పందించారు. షిండే మూడు పేజీల లేఖను ట్వీట్ చేశారు. “ఎన్సిపి, కాంగ్రెస్ల ముందు బ్యూరోక్రాట్లు మాకు గౌరవం ఇవ్వరు. మాకు అవమానం జరిగింది. మిమ్మల్ని (ఉద్ధవ్ థాకరే) కలవడానికి ఎన్సిపి, కాంగ్రెస్లకు అనుమతి లభిస్తుంది, కానీ మాకు మాత్రం మీ గది తలుపులు మూసుకుపోయాయి. కాంగ్రెస్, ఎన్సిపిలకు నిధులు అందుబాటులో ఉన్నాయి. వారికి ఎందుకు నిధులు లభిస్తున్నాయి, మనకు ఎందుకు లభించట్లేదని మా నియోజకవర్గంలోని ప్రజలు మాకు అడుగుతున్నారు” అని ట్వీట్ చేశారు.
https://twitter.com/mieknathshinde/status/1539863093571792896?s=20&t=9MLg722aZnlKWJHFrAkxAA
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే నిన్న పార్టీ ఎమ్మెల్యేల తిరుగుబాటుతో, వారు కోరితే తాను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. శివసేన నాయకులు, శాసనసభ్యులు తనకు వ్యతిరేకంగా ఉంటే పార్టీ చీఫ్ పదవిని కూడా వదులుకుంటానని అన్నారు.