ఏప్రిల్మొ 3 న సుక్మా బీజాపూర్ మధ్య చత్తీస్గర్ రాష్ట్రంలో జరిగిన నక్సల్స్ దాడిలో బీజాపూర్ లో అపహరింప బడ్డ కోబ్రా జవాన్ రాకేష్ సింగ్ మన్హాస్ ని నక్సల్స్ ఈ రోజు ఏప్రిల్ 8 న విడుదల చేశారు. 22 మంది జవానులు ప్రాణాలు కోల్పోయిన ఈ దాడిలో 30 మందికి పైగా తీవ్ర గాయాలు తగిలాయి. 210 వ CoBRA బెటాలియన్ కి చెందిన రాకేష్ సింగ్ ని నక్సల్స్ దాడిలో అపహరించారు. దాడి తరువాత కేంద్ర హోమ్ మంత్రి శ్రీ అమిత్ షా పోలీసు బలగాలని హాస్పిటల్ రాకేశ్వర్లో సందర్శించి ఈ చర్యకు దీటుగా సమాధానం ఉంటుందని చెప్పిన నేపధ్యం లో నక్సల్స్ అపహరింపబడ్డ పోలీసు ని విడుదల చేయటం ఆసక్తికరం గా వుంది.
నక్సల్స్ తాము పోలీసులకి శత్రువులం కామని, ఒక జవాన్ తమ చేతిలో బందీగా వున్నాడని, ప్రభుత్వం తో చర్చలకు తాము సిద్ధమని మావోయిస్టు పార్టీ రెండు పేజీల ప్రకటన వదిలింది. ప్రభుత్వం తరపున చర్చల గురించి స్పందన రాకమునుపే రాకేశ్వర్ ని విడుదల చేయటం ఆసక్తి కరంగా వుంది.
జమ్మూ ప్రాంతానికి చెందిన రాకేశ్వర్ విడుదల కావటం సంతోషంగా ఉందని కేంద్ర మంత్రి Dr జితేంద్ర సింగ్అన్నారు.