ఆర్ఎస్ఎస్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భగవత్ ఏప్రిల్ 3న నవ్రే ఉత్సవాల సందర్భంగా కశ్మీర్ హిందూ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. జమ్మూలోని సంజీవనీ శారదా కేంద్రం ‘త్యాగ్, శౌర్య దివస్’ను పురస్కరించుకుని ఏప్రిల్ 1 నుంచి 3 రోజులపాటు కార్యక్రమం నిర్వహిస్తోంది. కశ్మీరీ సమాజం వారి స్వదేశానికి తిరిగి వచ్చేందుకు ప్రతిజ్ఞ చేయవలసిందిగా కోరింది. సంజీవని శారదా కేంద్రం అనేక సంవత్సరాలుగా సంఘంలోని సభ్యులు, పాఠశాల విద్యార్థులతో నవ్రే, త్యాగ్, శౌర్య దివస్’ను జరుపుతోంది.అందులో భాగంగా సెమినార్లు, వ్యాస రచన,క్విజ్ పోటీలను నిర్వహించేది.
సంజీవని శారదా కేంద్రం ప్రకారం, నవ్రే అనే పదం సంస్కృత ‘నవ వర్ష’ నుంచి వచ్చింది అని నమ్ముతారు, నూతన సంవత్సరం అని దాని అర్థం. నవ్రే వేడుకలు శ్రియా భట్ (కశ్మీరీ హిందువుల రక్షకురాలిగా చెప్పే ఒక చారిత్రక చిహ్నం) జ్ఞాపకార్థం ‘త్యాగ్ దివస్’తో ఏప్రిల్ 1న ప్రారంభమవుతాయి. ఏప్రిల్ 2 న, నూతన సంవత్సరం మొదటి రోజు నవ్రే సంకల్ప్ దివస్గా జరుపుకుంటారు.
ఏప్రిల్ 3న ఎనిమిదవ శతాబ్దపు కశ్మీర్ రాజు లల్తాదిత్య ముక్తాపిడా, అతని శౌర్యం.. తురుష్కులపై విజయం కోసం తూర్పు, దక్షిణ భారతదేశంలోని మధ్య ఆసియా నుంచి బెంగాల్ వరకు అతని రాజ్యాన్ని విస్తరించినందుకు గౌరవార్థం శౌర్య దివస్ జరుపుకుంటారు. ఈసారి కశ్మీరీ హిందూ సమాజంతోమోహన్ భగవత్ వర్చువల్ మీటింగ్ తో నవ్రే వేడుకలు ముగియనున్నాయి.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)