కోల్ కతాలో దుర్గానవరాత్రులు ఎంత అట్టహాసంగా జరుగుతాయో అందరికీ తెలుసు. ఇక అక్కడి పూజాపండల్లైతే ప్రత్యేకంగానిలుస్తాయి. ఈసారి పూజా మండపం ప్రపంచంలో అత్యంత ఎత్తైన బూర్జ్ ఖలీఫా టవర్ ను ప్రతిబింబిస్తోంది. ప్రతిఏటా ఐకానిక్ కట్టడాల్ని ప్రతిబింబించేలా మండపాలు ఏర్పాటు చేస్తుంటారు. గతంలో పారిస్ ఒపెరా, కేదారినాథ్ , పూరీ మందిరాల్లాంటివి ఏర్పాటు చేశారు. ఈసారి 145 అడుగుల ఎత్తులో మండపం ఏర్పాటు చేశారు. రాత్రి పూట విద్యుద్దీపాల వెలుగులో మండపం శోభాయమానంగా దర్శనమిస్తోంది. 250మంది కార్మికులు రెండు నెలలపాటు శ్రమించి దీన్ని నిర్మించారు.