మహారాష్ట్ర ఎంపీ నవనీత్ కౌర్ రాణా, ఆమె భర్త,ఎమ్మెల్యే రవిరాణాకు బెయిల్ మంజూరైంది. ముంబై సెషన్స్ కోర్టు వారికి షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. సీఎం ఉద్ధవ్ ఠాక్రే నివాసం మాతోశ్రీ ముందు హనుమాన్ చాలీసా పఠిస్తామని ప్రకటించడంతో గొడవ మొదలైన సంగతి తెలిసిందే. వారి ప్రకటనలో ఉద్రిక్తతలు తలెత్తుతాయని భావించి ఏప్రిల్ 23న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమ అరెస్ట్ రాజ్యాంగ, చట్ట విరుద్ధమని ఆ జంట వాదిస్తూ బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. అయితే ఎట్టకేలకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే జైలునుంచి వెళ్లిన తరువాత మీడియోతో మాట్లాడవద్దని షరతు విధించింది న్యాయస్థానం. 50 వేల పూజీకత్తుపై వారిని విడుదల చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. నవనీత్ రానా దంపతులను విచారణకు పిలవాలంటే 24గంటల ముందు నోటిసులివ్వాలని ముంబై పోలీసులను ఆదేశించింది కోర్టు.