పశ్చిమబెంగాల్లో తాజా ఘర్షణలపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. మోమిన్పూర్లో హింస ఏమాత్రం తగ్గుముఖం పట్టలేదని తక్షణం కేంద్ర బలగాలను పంపాలని విపక్షనేత సువేందు అధికారి కేంద్రానికి లేఖరాశారు.
ఆదివారం కోల్ కతాలోని మోమిన్ పూర్లో హిందువులు లక్ష్మీపూజను జరుపుకుంటుండగా కొందరు ముస్లింలు మెరుపుదాడి చేశారు. అక్కడి మైలా డిపోలోని హిందువులకు చెందిన బైకులు, దుకాణాలను, ఇళ్లను దుండగులు తగులబెట్టినట్టు తెలిసింది. అందుకు సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి.
కోల్కతా విమానాశ్రయంలోని మయూర్భంజ్లో హిందువుల ఇళ్లపై కొందరు దాడికి దిగడంతో అక్కడి వారు ప్రాణాలు అరచేతపట్టుకుని పారిపోయారు. పరిస్థితులు అంత ఉద్రిక్తంగా మారితే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని రాష్ట్ర బీజేపీ ఆరోపిస్తోంది.
హింసకు సంబంధించిన వీడియోలు సోషల్మీడియాలోనూ వైరల్ అయ్యాయి. దుండగులు హిందువులపైకి రాళ్లు, ఇటుకలు, బాంబులు విసురుతుంటే వాళ్లతో పాటు పోలీసులు కూడా పారిపోవాల్సి వచ్చిందని బీజేపీ నేత ప్రీతమ్ సుర్ ఆ వీడియోలు జతచేస్తూ ట్వీట్ చేశారు. ఇక ఎక్బాల్పూర్ పోలీస్ స్టేషన్ ను ముట్టడించి పోలీసులనే పారిపోయేలా చేసిన మరో వీడియోను విపక్షనేత సువేందు అధికారి షేర్ చేశారు.
https://twitter.com/pritamsur1/status/1579206435292209154?s=20&t=hA_V-_EfXmdYeTvHYc1r0g
అయితే సాటి ముస్లింలే తమపైకి దాడి చేశారని సయ్యద్ ఇఫ్తియాక్ అనే వ్యక్తి ట్వీట్ చేశాడు. తాము మిలాద్ ఉన్ నబీ ని శాంతియుతంగా జరుపుకుంటుంటే ముగ్గురు వ్యక్తులు పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న బంగ్లాలో రహస్యంగా మాట్లాడుకున్నారని… షాబాజ్ అతని అనుచరులే పోలీస్ స్టేషన్ లోపల అరాచకం సృష్టించారని అన్నాడు. ఇక బీజేపీ నేత అమిత్ మాలవ్యా ఇస్లామిస్టులు పూజామండపాలను ధ్వంసం చేస్తున్న వీడియోలను షేర్ చేశారు. శరద్ పూర్ణిమ సందర్భంగా అక్కడివారు లక్ష్మీపూజ నిర్వహించుకుంటారు. అప్పుడే శివారు ప్రాంతమైన మోమిన్ పురాలో కొందరు దుండగులు బీభత్సం సృష్టించినట్టు తెలిసింది. ప్రభుత్వం తప్పులమీద తప్పులు చేస్తోందని..సమయం వచ్చినప్పుడు అనుభవిస్తారని సువేందు ట్వీట్ చేశారు. అంతేకాదు కోల్ కతాలో కేంద్రబలగాలను మోహరించాలని కోరారు.
ఈమేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకూ సువేందు లేఖరాశారు.
ఇస్లాంవాదుల దాడికి గురైన హిందూ సమాజాన్ని రక్షించాలని కోరారు. గూండాలు,సంఘ వ్యతిరేకులు హిందువులకు చెందిన అనేక దుకాణాలు, బైక్లను ధ్వంసం చేశారని అందులో పేర్కొన్నారు. మోమిన్పూర్లో హిందువులపై జరుగుతున్న హింసాకాండ హౌరా, నదియా, ముర్షిదాబాద్ జిల్లాల్లో గతంలో జరిగిన దాడులను గుర్తుకు తెస్తోందని సువేందు ఆందోళన వ్యక్తం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని కేంద్రం జోక్యం చేసుకుని సీఆర్పీఎఫ్ బలగాలను మోహరించాలని కోరారు లేఖలో సువేందు.