కర్నాటకలోని ఐకానిక్ కోలార్ క్లాక్ టవర్ పై త్రివర్ణ పతాకం ఎగిరింది. కట్టుదిట్టమైన భద్రత మధ్య జిల్లా అధికారులు ఇస్లామిక్ జెండాను తొలగించి జాతీయ జెండాను ఎగురవేశారు. దీంతో పట్టణంలో కొద్దిసేపు ఉద్రిక్తం నెలకొంది. అయితే పోలీసులు అప్రమత్తమై పరిస్థితిని అదుపుచేయడంతో ప్రస్తుతం అంతా ప్రశాంతంగా ఉంది.
కోలార్లోని ప్రసిద్ధమైన ఈ టవర్ కు 75 ఏళ్లుగా ఆకుపచ్చ రంగు వేస్తున్నారు. అయితే భారీ భద్రత నడుమ అధికారులు తెలుపు రంగు వేశారు.
టవర్ కు రంగు మార్చిన తరువాత మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. ముస్లింలు సహా స్థానికులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరల్ అవుతోంది.
కోలార్ ఎంపీ మునిస్వామి క్లాక్ టవర్పై ఎగురవేసిన ఇస్లామిక్ జెండాను తీసేసి త్రివర్ణ పతాకం ఆవిష్కరిస్తానని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. అనుకున్నట్టే చేశారు. ఈ విషయాన్ని చెబుతూ ట్వీట్ చేశారు మునిస్వామి.
https://twitter.com/bjp_muniswamy/status/1505124358838108160?s=20&t=L2-IcdLXffG5dxFo84rNOg
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)