గణతంత్ర దినోత్సవం సందర్భంగా శ్రీనగర్లోని ప్రఖ్యాత లాల్ చౌక్ క్లాక్ టవర్ పై త్రివర్ణ పతాకం ఎగిరింది. స్థానికులే అక్కడ జెండా ఆవిష్కరించి ఉత్సవాలు చేసుకున్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఘంటాఘర్ పై పతాకాన్ని ఎగురవేయడం ఇదే మొదటిసారి. స్థానిక యువకులు సాజిద్ యూసుఫ్ షా, సహిల్ బషీర్లు ఒక క్రేన్ సాయంతో క్లాక్ టవర్ పైవరకూ వెళ్లి అక్కడ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా మన దేశ జెండా ఎగురని ఒకే ఒక ప్రాంతం లాల్ చౌక్. ఏటా అక్కడ పాకిస్తాన్ జెండా మాత్రమే ఎగిరేది. గతంలో పలువురు అక్కడ మువ్వన్నెల పతాకాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేసినా సాధ్యపడలేదు. 370 ఆర్టికల్ రద్దు తరువాత పరిస్థితిలో మార్పు వచ్చింది.