జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా ఈ రోజు అదిలాబాద్ లో పంజాబ్ చౌక్, మార్కెట్ యార్డ్ ఆవరణ లో కిసాన్ దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సుహాసిని మాట్లాడుతూ రైతు సోదరులకు, సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. రైతు సమస్యల మీద ఉద్యమించిన మాజీ ప్రధాని శ్రీ చరణ్ సింగ్ జయంతిని “కిసాన్ దీవస్” గా జరుపుకుంటున్నాము. ఆయన కృషి వల్ల జమీందారీ చట్టం రద్దయి, కౌలు చట్టం అమలులోకి వచ్చాయి. రైతులకు బ్యాంక్ రుణాలు ఇవ్వడానికి సిద్ధం అయ్యాయి. రైతు రాజు కావాలంటే అందరూ సహకరించాలి అని అన్నారు.