ఉత్తరప్రదేశ్ తరహాలో మధ్యప్రదేశ్ మదర్సాలలో జాతీయగీతాలాపన తప్పనిసరి చేయనున్నారు. మదర్సాలలో జాతీయగీలాతాపనను తప్పనిచేసే విషయాన్ని పరిశీలిస్తున్నట్టు హోంమంత్రి మిశ్రా చెప్పారు. జాతీయగీతం ఎక్కడైనా పాడుకోవచ్చని…ఇది కచ్చితంగా పరిశీలించాల్సిన అంశమేనని అన్నారు.
”జాతీయగీతాన్ని పాకిస్థాన్లో పాడమని తామేం చెప్పడం లేదని…మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ సహా దేశమంతటా విద్యాసంస్థల్లో జాతీయ గీతం పాడటం, భారత్ మాతా కీ జై నినాదాలు ఉండాలని అన్నారు. ఇందుకు అనుగుణంగా తీసుకునే నిర్ణయాలను తాము స్వాగతిస్తామనీ అన్నారు.
ఉత్తరప్రదేశ్లోని అన్ని మదర్సాలలో ఈనెల 12 నుంచి ‘జనగణమన’ గీతాలాపనను తప్పనిసరి చేశారు. ఈ మేరకు మే 9న అన్ని జిల్లాల మైనారిటీ సంక్షేమ అధికారులకు ఉత్తరప్రదేశ్ మదర్సా ఎడ్యుకేషన్ బోర్డు ఆదేశాలిచ్చింది.