రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పలువురు మహిళలకు “నారీశక్తి పురస్కార్” అవార్డులను అందజేశారు. “అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళలు అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలుస్తున్నారు. వారి భద్రత, గౌరవాలకు భంగం కలగకుండా వారి కలలు, ఆకాంక్షలను కొనసాగించడానికి అవకాశాలను అందించే విధంగా దృఢనిశ్చయంతో ఉండాలని” అన్నారు. అనిత గుప్తా, ఆర్తి రానా, మీరా ఠాకూర్, నివృతి రాయ్, టిఫనీ బ్రార్, వనితా జగదేవ్ బోరాడే సహా పలువురిని అవార్డులతో సత్కరించారు.
https://twitter.com/rashtrapatibhvn/status/1501068365431185409?s=20&t=AW-raDcTKgTVSbKYPzmhaA
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)