ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన డోసు బాగానే పనిచేసింది. మోడీకి బాగా మండింది అన్న సందేశం అగ్ర రాజ్యం అమెరికాకు చేరింది. దీంతో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్వరం మార్చారు. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపింది తాను కాదని స్పష్టంగా అంగీకరించారు. ఈ విషయంలో మధ్యవర్తత్వం చేసే ఆలోచన కూడా లేదని ఆయన ఒప్పుకున్నారు.
……
దీని వెనక చాలా కథ నడిచింది. భారత్ పాకిస్తాన్ యుద్ధం ఆపింది తానే అంటూ కొంతకాలంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటనలు చేస్తున్నారు. ఈ మాటలు పుచ్చుకుని భారత్ లోనే ప్రతిపక్ష పార్టీలు నానా రచ్చ చేస్తున్నాయి. జరిగింది ఒకటైతే,, ప్రచారం మరొకటి జరిగిపోతూ వస్తోంది. దీనికి చెక్ పెట్టేందుకు స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రంగంలోకి దిగారు.
…
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంఫ్ నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోన్ చేసి మాట్లాడారు. యుద్ధాన్ని మీరెవరో ఆపలేదని మూడో పార్టీ ప్రమేయం లేనేలేదని స్పష్టంగా తేల్చి చెప్పారు. జోక్యాన్ని ఎవ్వరూ అడగలేదంటూ ట్రంప్కి చురకలు అంటించారు ప్రధాని మోదీ. భారత్, పాక్ మధ్య ట్రంప్ మధ్యవర్తిత్వం ప్రకటనను ప్రధాని మోదీ ఖండించారు. జమ్ముకశ్మీర్పై భారత్-పాక్ మధ్య ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని కూడా స్పష్టం చేశారు. ఇక ముందు కూడా ఒప్పుకునే ప్రసక్తే లేదని అన్నారు. జీ 7 సదస్సు నుంచి ట్రంప్ అర్ధాంతరంగా వెళ్లిపోవడంతో కెనడాలో ఇద్దరు నేతల కలయిక జరగలేదు. ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల నేపథ్యంలో ట్రంప్- హుటాహుటిన అమెరికాకు వెళ్లడంతో.. ఇద్దరూ ఫోన్లో మాట్లాడుకొన్నారు.
ఈ టెలిఫోన్ సంభాషణలో మరో సంఘటన చోటుచేసుకుంది.
నరేంద్ర మోదీని తమ దేశానికి రావాలంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆహ్వానించారు. కెనడా పర్యటన పూర్తైన తర్వాత తమ దేశానికి రావాలంటూ కోరారు. అగ్రరాజ్యం ఆహ్వానిస్తే ఎవరో వదులుకోరు,, కానీ మోదీ మాత్రం.. ట్రంప్ ముఖం మీదే అమెరికాకు రాలేనని చెప్పేసి,, ఆయన ఆహ్వానాన్ని తిరస్కరించారు. ప్రస్తుత షెడ్యూల్ కారణంగా అది కుదరదని మోదీ, ట్రంప్తో అన్నారు.
ఇక్కడే ప్రధానమంత్రి మోడీ తనదైన వ్యూహాన్ని అమలు చేశారు. భారత్ పాకిస్తాన్ మధ్య తాను మధ్యవర్తిత్వం చేస్తున్నాను అని పదేపదే ట్రంప్ చెబుతున్నారు. ఇటువంటి సమయంలో.. ట్రంపును కలిసినట్లయితే ఆయన వాదాన్ని బలపరిచినట్లు అవుతుంది. పైగా ఈ సమయంలో వాణిజ్య సంబంధాలు ఏమైనా బయట పెడితే అది మరింత గోల అవుతుంది. అందుచేతనే స్పష్టంగా ఈ ఆహ్వానాన్ని మోదీ తిరస్కరించారు. ఇందులో మరో పాయింట్ కూడా ఉంది. అమెరికా అధ్యక్షుడు స్వయంగా ఆహ్వానించినప్పటికీ రాను అని చెప్పడం ద్వారా.. మోదీ దృఢమైన వైఖరిని అవలంబించారు. అమెరికా లాంటి అగ్రరాజ్యం పిలిచినంత మాత్రాన మనం పరిగెత్తుకుని వెళ్లాల్సిన అవసరం లేదు అన్న సందేశాన్ని ఇచ్చారు. దీంతో ప్రపంచ దేశాలలో భారత్ బలపడుతోంది అన్న సంకేతం బయటకు వచ్చింది. మరోవైపు జీ7 దేశాల అగ్రనేతలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశాలు జరిపారు. తద్వారా పెద్దదేశాలతో స్నేహ సంబంధాలను పట్టిష్టం చేసుకుని వచ్చారు.
……..
అమెరికాకు పిలిచినా,, రాను అని చెప్పడం ద్వారా ప్రధాని మోదీ తన నిరసన వెలిబుచ్చారు. ఇది అర్థం చేసుకున్న అమెరికా అధ్యక్షుడు ట్రంఫ్ మెట్టు దిగి వచ్చారు. మొత్తం మీద మోదీ ఇచ్చిన డోస్ భలే పనిచేస్తుందని పరిశీలకులు అంటున్నారు.