ఎక్కడున్నా ఏ దేశంలో ఉన్నా…పుట్టినరోజున మాత్రం తన తల్లి చెంతన వాలి ఆమె ఆశీస్సులు పొందే భారత ప్రధాని మోదీ ..మాతృమూర్తి హీరా బెన్ వందో పుట్టినరోజు సందర్భంగా ఆమె ఆశీస్సులు తీసుకున్నారు. ఆమె కాళ్లు కడిగి దీవెనలు అందుకున్నారు. తల్లితో గడిపిన రోజుల్ని, మధుర క్షణాలను గుర్తు చేసుకున్నారు. ఆమెతో కలిసి ఇంట్లోని పూజామందిరంలో ప్రత్యేక పూజలు చేశారు. తన స్నేహితులనూ తల్లి ఎంతో ఆదరించేదని గుర్తు చేస్తూ…తండ్రి స్నేహితుడి కుమారుడు అబ్బాస్ ను ఎంత ఆప్యాయంగా చూసేదో చెప్పుకొచ్చారు.
గాంధీనగర్లోని రాయసన్ లో మరో కుమారుడు పంకజ్ మోదీ ఇంట్లో హీరాబెన్ ఉంటున్నారు. మోదీ అక్కడికే వెళ్లి కాసేపు తల్లితో గడిపారు. ఇక మోదీ పుట్టి పెరిగిన వాద్నగర్ లోనవి హట్కేశ్వర్ మహదేవ్ ఆలయంలో హీరాబెన్ ఆయుష్షును కాంక్షిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పంచమహాల్స్జిల్లా పావ్గఢ్లోని మహంకాళి దేవాలయాన్ని మోదీ సందర్శించారు. దీన్ని పునర్నిర్మించిన తర్వాత ప్రధాని మోదీ సందర్శించడం ఇదే తొలిసారి. 52 శక్తి పీఠాల్లో పావ్గఢ్ ఒకటి.