ప్రపంచ నాయకుల పాపులారిటీ రేటింగ్లను విడుదల చేసే గ్లోబల్ రేటింగ్ సంస్థ మార్నింగ్ కన్సల్ట్ పొలిటికల్ ఇంటెలిజెన్స్, 77 శాతానికి పైగా రేటింగ్తో ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన నాయకులలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఒకరని తెలిపింది.
గుజరాత్లోని వాద్నగర్కు చెందిన ఒక సాధారణ టీ అమ్మకందారు నుంచి దేశంలోని అత్యున్నత పదవిని అధిష్టించేవరకు సాగిన ఆయన ఆయన ప్రయాణం భారత్ ను గర్వపడేలా చేస్తోందని పేర్కొంది.
సెప్టెంబరు 17, 1950న గుజరాత్లోని వాద్నగర్లో దామోదర్దాస్ మోదీ, హీరాబెన్ దంపతులకు జన్మించిన నరేంద్ర మోదీ ఆ దంపతుల ఆరుగురు సంతానంలో మూడోవాడు. ఆయన తండ్రి వాద్నగర్ రైల్వే స్టేషన్లోని టీ స్టాల్లో టీ అమ్మేవాడు.
తాపీ నదిలో వరదలు విధ్వంసం సృష్టించినప్పుడు, 9 ఏళ్ల మోదీ తన స్నేహితులతో కలిసి ఫుడ్ స్టాల్ను ప్రారంభించి, వచ్చిన మొత్తాన్ని సహాయ కార్యక్రమాల కోసం విరాళంగా ఇచ్చారని చాలామందికి తెలియదు.
ఇండో-పాకిస్థాన్ యుద్ధ సమయంలో సరిహద్దుల నుంచి తిరిగి వస్తున్న జవాన్లకుకూడా మోదీ టీ అందించారు. జామ్నగర్లోని సైనిక్ పాఠశాలలో చేరాలనే అతని కలలు అతని కుటుంబ ఆర్థిక పరిస్థితి కారణంగా నెరవేరలేదు. కానీ కొన్నేళ్ల తరువాత ప్రధాని అయి 2014లో సియాచిన్ సందర్శనలో ఆర్మీ యూనిఫాం ధరించి తన కల నెరవేరినట్టు సంతోషించారుమోదీ.
1975లో మోదీ గుజరాత్ లోక్ సంఘర్ష్ సమితికి ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ…ఆ సమయంలో ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఉద్యమించారు. ఆ కాలంలో ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళవలసి వచ్చింది. అదే సమయంలో కార్యకర్తలకు నెట్వర్క్ను రూపొందించడంలో పాలుపంచుకున్నారు.
1978లో సూరత్, వడోదరకు ఆర్ఎస్ఎస్ సంభాగ్ ప్రచారక్గా నియమితులయ్యారు. 1990లో నరేంద్ర మోదీ గుజరాత్కు తిరిగి వచ్చారు. ఎల్కె అద్వానీ రథయాత్రలో కీలక బాధ్యత తీసుకుని చురుకుగా పనిచేశారు.
1994లో రాజకీయాల నుంచి కొంత విరామం తీసుకున్నారు. అద్వానీ ఆదేశంతో కొన్నిరోజులకే ఎన్నికల రాజకీయాలలోకి తిరిగి వచ్చారు. 1995లో గుజరాత్లో BJP విజయంలో కీలకపాత్ర పోషించారు.
అక్టోబర్ 2001లో ఆరోగ్యం క్షీణించిన కేశూభాయ్ పటేల్ స్థానంలో మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అంతేకాకుండా, 2001 భుజ్ భూకంపం విషయంలో ఆయన ప్రభుత్వం వ్యవహరించిన తీరు విమర్శలపాలైంది. 2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ తొలిసారిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో విపక్షాలు ఆయన రాజీనామా కోసం డిమాండ్ చేశాయి. అయితే గోవాలో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఆయన రాజీనామాను ఆమోదించలేదు.
2002, జూలై 19న తన మంత్రివర్గ అత్యవసర సమావేశం తర్వాత మొత్తం రాజీనామా చేశారు.. మళ్ళీ ఎన్నికలలో మోదీ రెండవసారి అధికారంలోకి వచ్చారు. ఆ ఏడాది 182 సీట్లున్న గుజరాత్ అసెంబ్లీలో బీజేపీ 127 సీట్లను కైవసం చేసుకుంది.
ఆ కాలంలోనే సీఎం మోదీ గుజరాత్ ముఖంగా, రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి వెనుకున్న ముఖ్యమైన వ్యక్తిగా ఎదిగారు.
ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఆయన గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో వీసా నిరాకరించిన అమెరికా, యూరోపియన్ యూనియన్ లు 2014లో దేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత స్వాగతం పలికాయి.
సింగూర్ నిరసనల కారణంగా పశ్చిమ బెంగాల్ నుంచి కంపెనీని తరలించవలసి వచ్చింది.అప్పుడు మోదీ నానో కోసం టాటాను గుజరాత్ కు ఆహ్వానించారు. ఆ ప్రాజెక్ట్ కోసం మోదీ ఎలా భూసేకరణ జరిపారన్నదీ ఆసక్తికరం.
మోదీ హయాంలో గుజరాత్ను తమ ఉత్పత్తి కేంద్రంగా మార్చేందుకు అనేక కంపెనీలు పోటీపడ్డాయి. ఆయన హయాంలో రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దిన కొన్ని ముఖ్యమైన విజయాలు ఇవీ…
వ్యవసాయ వృద్ధి రేటు 10.97 శాతానికి చేరింది…
రియల్ ఎస్టేట్ పెట్టుబడులు 2007లో రూ. 6.6 ట్రిలియన్లను తాకింది…
వీటి తోపాటు గుజరాత్లోని ప్రతి గ్రామానికి విద్యుద్దీకరణ…
ఆయన సీఎంగా ఉన్న సమయంలో గుజరాత్ జీడీపీ వృద్ధి రేటు సగటున 10 శాతంగా నమోదైంది. 2013లో “ఎకనామిక్ ఫ్రీడమ్ అఫ్ ది స్టేట్స్ అఫ్ ఇండియా” నివేదిక 20 భారతీయ రాష్ట్రాలలో గుజరాత్ను మొదటి స్థానంలో పేర్కొంది. ఆయన హయాంలోనే వరుసగా రెండేళ్ల పాటు ప్రపంచ బ్యాంకు “ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్”లో గుజరాత్ అగ్రస్థానంలో నిలిచింది.
2014లో భారతీయ జనతా పార్టీ తరపున ప్రధాన మంత్రి అభ్యర్థిగా మోదీ ని పార్టీ ప్రకటించింది. బీజేపీకి ‘మోడీ వేవ్’ కారణంగా ఓట్ల శాతం 31 శాతానికి పెరిగింది. ఈ మధ్య కాలంలో దేశంలో రాజకీయ ప్రచారంలో ‘అచ్ఛే దిన్’, ‘అబ్కీ బార్ మోడీ సర్కార్’ నినాదాలు ఇంటింటి నినాదంగా మారాయి.
1984 తర్వాత ఎన్నికల్లో సొంత మెజారిటీతో గెలుపొందిన తొలి రాజకీయ పార్టీగా బీజేపీ 282 సీట్లు గెలుచుకుంది. మోదీ, వారణాసి, వడోదర నుంచి రెండు స్థానాలను గెలుచుకున్నారు. ముఖ్యంగా వారణాసిలో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ను 371,784 ఓట్ల తేడాతో ఓడించారు.
ఆగస్ట్ 15, 2014న ఎర్రకోట ప్రాకారాల నుంచి తన మొట్టమొదటి స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో, మోదీ ‘జహాన్ సోచ్ వహన్ శౌచలే’ పిలుపునిచ్చాడు. అప్పుడే పరిశుభ్రత వంటి ప్రాథమిక సమస్యల గురించి మాట్లాడాడు. తరువాతి సంవత్సరాలలో నరేంద్ర మోదీ ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా వంటి అనేక పథకాలను రూపొందించి ప్రజాదరణ పొందింది. ఇటీవలే ఆత్మనిర్భర్ భారత్, డిజిటల్ ఇండియా, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి వంటి వాటిని రూపొందించింది.
నోట్ల రద్దుతో పాటు ప్రతిపక్షాలు, ఆర్థికవేత్తలలోని ఒక వర్గం తరచుగా విమర్శించడానికి కారణం మోడీ ప్రభుత్వం తన మొదటి టర్మ్లో తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలలో ఫ్రాన్స్ నుంచి రాఫెల్ ఫైటర్ జెట్లను త్వరితగతిన కొనుగోలు చేయడం. స్వదేశీ అభివృద్ధిపై దృష్టి సారించేందుకు ప్రభుత్వం రక్షణ సేకరణ విధానాలను కూడా సవరించింది.
2016లో జరిగిన సర్జికల్ స్ట్రైక్స్, ఉరీ, పఠాన్కోట్ దాడులు, బాలాకోట్ ఆపరేషన్ తర్వాత మొదటి పదవీకాలం ముగిసే సమయానికి, ఉగ్రవాదాన్ని దౌత్యపరంగా ఎదుర్కోవడానికి ఆ దేశం సుముఖంగా లేదని భారత్ పొరుగు దేశాలకు గట్టి సందేశం పంపింది…
వన్ ర్యాంక్ వన్ పెన్షన్ (OROP) అమలు ద్వారా యుద్ధ అనుభవజ్ఞులకు వారి సేవలు ముగిసిన తర్వాత కూడా తన సైనికుల సంక్షేమానికి భరోసా ఇవ్వడానికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చింది.
2019 సార్వత్రిక ఎన్నికలలో నరేంద్ర మోదీ ఆద్వర్యంలోని బీజేపీ 303 స్థానాలను కైవసం చేసుకోవడంతో తిరిగి అధికారంలోకి వచ్చారు. దీంతో NDA సంఖ్య 353కి చేరుకుంది. ఆర్టికల్ 370 రద్దు జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేయాలనే నిర్ణయాన్ని నరేంద్ర మోదీ ప్రభుత్వం అప్పటివరకు హైలైట్ చేసింది.
రైతుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం ఆమోదించిన వ్యవసాయ చట్టాలపై రైతు సంఘాల నిరసనలతో వెనక్కి తగ్గారు. పౌరసత్వ సవరణ చట్టం (CAA) అలాగే యూనిఫాం సివిల్ కోడ్పై ప్రభుత్వం తన స్టాండ్ను గట్టిగా చెప్పింది