పాకిస్తాన్ తో యుద్ధం ఆపేశారు అని చాలామంది ఆవేదన చెందుతున్నారు. అనేకమంది జాతీయ వాదులు కూడా ఈ విషయంలో నిరాశ పడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయం సరికాదని బహిరంగంగానే చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు,, కానీ ఇదంతా ఎత్తుగడలో భాగమని నెమ్మది నెమ్మదిగా అర్థం అవుతోంది. పాకిస్తాన్ ను అష్టదిగ్బంధనం చేసేందుకు భారత్ అన్ని మార్గాలని ఉపయోగించు కొంటోంది. అంతర్జాతీయ సమాజంలో పాకిస్థాన్ ను ఒంటరిగా నిలబెట్టినట్లయితే… యుద్ధం, ఆయుధాలు , వేల కోట్ల రూపాయల ఖర్చు అక్కర్లేకుండానే విజయం సాధించవచ్చు అనేది సుస్పష్టం.
………….
అకస్మాత్తుగా ఆఫ్గానిస్తాను ఇప్పుడు ఒక బాంబు పేల్చింది. భారతదేశం బాటలోనే తాము ప్రయాణం చేయాలని నిర్ణయించుకుంది. పాకిస్తాన్ తో ఉన్న అంతర్జాతీయ నదీ జలాల ఒప్పందాన్ని పక్కన పెట్టేసేందుకు తాలిబాన్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య ప్రవహిస్తున్న నదులు మీద ఎగువ భాగంలో … అంటే ఆఫ్గానిస్థాన్ భూభాగంలో ప్రాజెక్టులు, డ్యాములు కట్టాలని నిర్ణయం తీసుకుంది. ఈ పని పూర్తయితే అఫ్గానిస్తాన్ కి సమృద్ధిగా నీరు లభిస్తుంది మరియు కావలసినంత విద్యుత్తు సరఫరా అవుతుంది. కానీ పాకిస్తాన్ లోని పశ్చిమ భాగం పూర్తిగా ఎండిపోవడం ఖాయం.
………….
ఆఫ్ఘనిస్తాన్ సైన్యంలోని ఇంజనీరింగ్ నిపుణుడు జనరల్ ముబిన్ రహస్యంగా తూర్పు అఫ్గాన్ ప్రాంతంలో పర్యటన చేశారు. కునార్ నది, దాని చుట్టుపక్కల నదుల మీద ప్రాజెక్టులు కట్టే విషయం మీద కసరత్తు చేసినట్లు సమాచారం. ఇక్కడ ఉన్న బక్షాబాద్, కామల్ ఖాన్, ఖేష్ తేప వంటి పాతకాలపు ఆనకట్టలను పటిష్టం చేస్తారు. విదేశీ నిధుల సహాయంతో భారీ డ్యాములుగా మార్చుకుంటారు .
అప్పుడు దిగువ భాగమైన పాకిస్తాన్ కి నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోతుంది.
………
ఇప్పటికే సింధు జలాల ఒప్పందాన్ని పక్కన పెట్టేసి భారత్ వడివడిగా ప్రాజెక్టులు కట్టేస్తోంది. దీంతో పాకిస్తాన్ తూర్పు భాగంలో తాగు, సాగునీరు దొరకడం దుర్లభం. ఈలోగా ఆఫ్గానిస్థాన్ ప్రాజెక్టులు కూడా పూర్తయితే పాకిస్తాన్ పశ్చిమ భాగం కూడా ఎండిపోవడం ఖాయం. నీటి చుక్క దొరక్క పాకిస్థాన్ ప్రజలు పాలకుల్ని తరిమి తరిమి కొట్టే రోజులు ఏర్పడతాయి.
……….
ఇది చాలా సీరియస్ విషయం అని గ్రహించిన పాకిస్థాన్ ప్రభుత్వము చైనాకు మొరపెట్టుకుంది. దీంతో చైనా రంగంలోకి దిగి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మంత్రులను చర్చలకు పిలిచింది దీనిని బట్టి ఇది ఎంత సీరియస్ మేటర్ అనేది అర్థం చేసుకోవచ్చు. డాములు కట్టవద్దు అని చైనా,, పాకిస్తాన్ ఇప్పుడు అఫ్గానిస్థాన్ ప్రభుత్వాన్ని బతిమిలాడుకుంటున్నాయి.
………….
దీనికి అసలు కారణం.. భారత విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్ ఇటీవల ..అకస్మాత్తుగా ఆఫ్గానిస్థాన్ విదేశాంగ మంత్రి ముత్తాకితో చర్చలు జరిపారు. అఫ్గాన్ ప్రజలకు వైద్యం చేయించు కునేందుకు భారత్ లో అవకాశం ఇవ్వాలన్న కోరికను .. జయశంకర్ ఆమోదించారు దీనికి ప్రతిగా తాలిబన్లు కూడా ముందుకు రావాలి అని మాత్రమే కోరారు. కానీ ఆ సమయంలోనే నీటి ప్రాజెక్టులకు సంబంధించి భారత్ ఒక సలహా ఇచ్చి ఉంటుంది అని పరిశీలకులు భావిస్తున్నారు. భారత్ ఇచ్చిన సలహాతో తాలిబాన్ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేసి పాకిస్తాన్ కు నీళ్లు ఆపేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం.
……….
దీనిని బట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్కెచ్ ఎలా ఉంటుందనేది అర్థం చేసుకోవచ్చు. నిశ్శబ్దంగా మోదీ వేస్తున్న అడుగులు పాకిస్తాన్ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి