దేశ వ్యాప్తంగా హనుమాన జయంతిని ఘనంగా జరుపుకుంటున్నారు. గుజరాత్ మోర్బి జిల్లాలో ఏర్పాటు చేసిన 108 అడుగుల ఎత్తైన హనుమాన్ విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రధాని.
అంతకుముందే ట్వీట్ ద్వారా ఈ విషయం వెల్లడించారుమోదీ. మనం హనుమాన్ జయంతి జరుపుకోబోతున్నాం. మోర్బిలో శనివారం ఉదయం 11 గంటలకు 108 అడుగుల ఎత్తయిన హనుమంతుడి విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నా అని ట్వీట్ చేశారు. ఈ కార్యక్రమంలలో పాల్గొనే అవకాశం రావడం అదృష్టంగా, గౌరవప్రదంగా భావిస్తున్నానని చెప్పారు మోదీ. హనుమాన్జీ4ధామ్ ప్రాజెక్టులో భాగంగా నాలుగు హనుమంతుడి విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా నాలుగు దిశల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నారు.
దేశానికి పశ్చిమంలో మోర్బిలోని పరమ పూజ్య బాపు కేశవానంద ఆశ్రమంలో ఓ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్టులో భాగంగా మొదటి విగ్రహాన్ని 2010లో సిమ్లాలో ఏర్పాటు చేశారు. దక్షిణాదిలో రామేశ్వరంలో హనుమంతుడి విగ్రహ ఏర్పాట్లను ప్రారంభించారు. హనుమాన్ జయంతి సందర్భంగా మోదీ దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ధైర్యసాహసాలు, సంయమనాలకు ప్రతీక హనుమంతుడని పేర్కొన్నారు. పవనపుత్రుని దయతో అందరి జీవితాల్లో బలం, వివేకం, జ్ఞానం నిండాలని ఆకాంక్షిస్తూ ఈ ట్వీట్ చేశారు.
Today, we mark the special occasion of Hanuman Jayanti. In Morbi, at 11 AM, a 108 feet statue of Hanuman ji will be inaugurated. I am honoured to be getting the opportunity to be a part of this programme via video conferencing. https://t.co/qjvLIHWWiO pic.twitter.com/kbHcIxd90Z
— Narendra Modi (@narendramodi) April 16, 2022