
PM Narendra Modi and the Prime Minister of Mauritius, Mr. Pravind Kumar Jugnauth lighting the lamp at the inauguration of the Global AYUSH Investment & Innovation Summit, in Gandhinagar, Gujarat on April 20, 2022.
దేశంలోని నాణ్యమైన ఆయుష్ ఉత్పత్తులకు ప్రామాణికతను అందించే సాంప్రదాయ ఔషధ ఉత్పత్తులను గుర్తించేందుకు భారత్ త్వరలో ‘ఆయుష్ మార్క్’ను ప్రారంభించనుందని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం చెప్పారు. సాంప్రదాయ చికిత్సల కోసం దేశానికి వచ్చే వారి కోసం భారతదేశం త్వరలో ‘ఆయుష్ వీసా’ కేటగిరీని ప్రారంభిస్తుందని కూడా ప్రధాని చెప్పారు.
మారిషస్ ప్రధాని ప్రవింద్ జుగ్నాథ్, డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ సమక్షంలో గుజరాత్లోని మహాత్మా మందిర్లో మూడు రోజుల గ్లోబల్ ఆయుష్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్నోవేషన్ సమ్మిట్ను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు.
https://twitter.com/narendramodi/status/1516661197277642756?s=20&t=DcNxNYkCQPefyVP7lBZRSw
“భారతదేశం త్వరలో ఆయుష్ మార్క్ ను పరిచయం చేస్తుంది, ఇది దేశంలోని నాణ్యమైన ఆయుష్ ఉత్పత్తులకు ప్రామాణికతను ఇస్తుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పరిశీలించిన ఉత్పత్తులకు మార్క్ ఇవ్వబడుతుంది. ఇది నాణ్యమైన ఆయుష్ ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నామనే విశ్వాసాన్ని ప్రపంచ ప్రజలకు కల్పిస్తుంది” అని మోదీ అన్నారు.
More Pics :