తెలంగాణ లోని కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన మీద ప్రధానమంత్రి నరేంద్రమోదీ మండిపడ్డారు. వ్యాపారం కోసం అడవుల్ని నాశనం చేస్తున్నారని ఆవేదన వెలిబుచ్చారు. సంచలనం రేపిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ భూముల విషయం మీద ప్రధాని స్పందించారు. ఇది చాలా దారుణమైన విషయం అని ఆయన అభిప్రాయ పడ్డారు.
Telangana Congress is destroying nature by running bulldozers on forests and animals. They have forgotten their promises – PM Narendra Modi#hcubiodiversity #telangana #modi pic.twitter.com/H7EfleuO0o
— MyIndMedia (@MyIndMedia) April 14, 2025
ప్రధాని మోదీ హర్యానాలో పర్యటించారు. అక్కడ హిస్సార్లో మహారాజా అగ్రసేన్ విమానాశ్రయం నుంచి అయోధ్యకు తొలి విమాన సర్వీసును జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలంగాణ వివాదం మీద మాట్లాడారు. అటవీ సంపదను హరించే పనిలో కాంగ్రెస్ బిజీగా ఉందని ఎద్దేవా చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను కూడా విస్మరించదని రేవంత్ ప్రభుత్వంపై మండిపడ్డారు. హస్తినలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు షెడ్యూల్డ్ కులాలు (ఎస్సిలు), షెడ్యూల్డ్ తెగలు (ఎస్టిలు), ఇతర వెనుకబడిన తరగతులు (ఒబిసిలు) వారిని ‘ద్వితీయ శ్రేణి పౌరులు’గా మార్చిందని మోదీ ఆరోపించారు. అడవులపై బుల్డోజర్లు నడిపించడంలో తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ బిజీగా ఉందని ఘాటు వాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా పర్యావరణ విధానాల మీద మోదీ వివరణాత్మకంగా మాట్లాడారు. తాము పర్యావరణాన్ని కాపాడుతుంటే వాళ్లు అటవీ సంపదను సర్వనాశనం చేస్తున్నారని మండిపడ్డారు. గ్యారంటీల పేరుతో తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ నాయకులు మోసం చేశారని విమర్శించారు. పచ్చని భూములపై బుల్డోజర్లు పంపి చెట్లను విధ్వంసం చేసి వణ్యప్రాణులకు నిలువ నీడ లేకుండా చేస్తున్నారనంటూ సర్కారుపై తీవ్రంగా మండిపడ్డాయి. ఈ వ్యవహారం కాస్త తెలంగాణ హైకోర్టు, సుప్రీంకోర్టుకు చేరడంతో న్యాయస్థానం జోక్యం చేసుకుని ఓ కమిటీని నియమించి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. తాజా ఈ భూమిలో జరిగిన విధ్వంసంపై ప్రధాని స్పందించారు.
ప్రధానమంత్రి ప్రకటనతో ఈ వివాదం మరింత వేడెక్కింది. దీంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇరుకున పడినట్లయింది.