ఎన్నికల ప్రచార సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొత్త బాంబు పేల్చారు. సర్జికల్ స్ట్రైక్స్ విషయంలో సంచలన విషయాలు బయట పెట్టారు. 2019 ఫిబ్రవరి లో పాకిస్తాన్ భూభాగం మీద భారత్ వైమానిక దళాలు బలగాలు సర్జికల్ దాడులకు పాల్పడిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ దాడులకు సంబంధించి చాలా విమర్శలు వినిపించాయి. యుద్ధనీతిని పాటించలేదని ఇంటా బయట కొంతమంది విమర్శలు చేశారు. ఈ క్రమంలో సర్జికల్ స్ట్రైక్ కి సంబంధించి మోడీ సంచలన విషయాలు బయటపెట్టారు.
జమ్మూ కాశ్మీర్లో పుల్వామా దగ్గర భారత బలగాల మీధ ఉగ్రవాదులు దాడి చేసి 40 మంది జవాన్లను బలి తీసుకున్నారు. దీనికి ప్రతీకారంగా భారత వైమానిక దళాలు 10 రోజులు తిరగకుండానే వైమానిక దాడులు చేపట్టింది. బాలకోటలో జైషే మహమ్మద్ ఉగ్రవాద స్థావరాలు మీద తెల్లవారుజామున బాంబులు వర్షం కురిపించింది. ఉగ్రవాదాన్ని ఎప్పటికీ సహించబోమని స్పష్టమైన సందేశం ఇచ్చింది.
ఇక్కడ మరో విషయం గుర్తుపెట్టుకోవాలి . భారతదేశ చరిత్రలో శత్రువులు మన భూభాగమైన దాడి చేయడమే తప్పితే, మనం అడుగు ముందుకేసి శత్రువు భూభాగంలోకి వెళ్ళింది లేదు. కానీ 2019లో మాత్రం వాయిమార్గంలో శత్రు భూభాగం మీద వెళ్లి ఉగ్రవాద స్దావరాలను నాశనం చేయడం జరిగింది. ఈ విషయంలో కూడా పూర్తిస్థాయిలో యుద్ధనీతిని పాటించామని నరేంద్ర మోడీ తాజాగా వెల్లడించారు. దీని గురించి ముందుగానే పాకిస్తాన్ కి తెలియజేశామని స్పష్టం చేశారు. పాకిస్తాన్ కు సమాచారం అందించిన తర్వాతే ప్రపంచానికి ఈ విషయాలు వెల్లడించామని ఆయన వివరించారు.
ఈ సందర్భంగా నరేంద్ర మోడీ కొన్ని హాట్ కామెంట్లు చేశారు.మోదీ ఏదీ దాచిపెట్టడు అని,, ఏది చేసినా బహిరంగంగానే చేస్తాడని… వెనకనుంచి దాడి చేయడం మీద మోడీకి నమ్మకం లేదని, శత్రువుతో ఎదురుగా నిలిచే పోరాడుతామని స్పష్టం చేశారు.