నటుడు, నందమూరి కుటుంబ సభ్యుడు తారకరత్న ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా తయారైందని వైద్యులు ప్రకటించారు. బెంగళూరుకు చెందిన నారాయణ హృదయాలయలో ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో ఆయన ఉన్నారు. కొద్దిసేపటిక్రితమే హెల్త్ బులెటిన్ విడుదల రిలీజ్ చేశారు. చిత్తూరు జిల్లా కుప్పంలో లోకేష్ నిర్వహించిన తొలి రోజు పాదయాత్రలో పాల్గొన్నారు తారకరత్న. పాదయాత్రలో కొద్దిదూరం నడిచిన వెంటనే సొమ్మసిల్లి పడిపోయారు. ఆయన్ను హుటాహుటిన కుప్పంలోని కేసీ ఆస్పత్రికి తరలించారు. అప్పట్నుంచి ప్రత్యేక వైద్య బృందం నేతృత్వంలో తారకరత్నకు చికిత్స అందిస్తున్నారు. హార్ట్ ఎటాక్ కారణంగా తారకరత్న ఆరోగ్యం క్షీణించిందని ప్రకటించిన వైద్యులు, అత్యవసర చికిత్సను కొనసాగించక తప్పని పరిస్థితి వచ్చిందన్నారు.