మే నెల ఒకటో తేదీ అంటే బుధవారం నుంచి పుష్కరాల సందడి మొదలవుతుంది ఈ ఏడాది నర్మదా నదికి పుష్కరాలు ఉంటాయని పండితులు తేల్చి చెబుతున్నారు. భారతదేశంలో పుష్కరాల్ని భావిస్తారు పుష్కర సమయంలో ఆయా నదుల్లో పుణ్యస్నానాలు ఆచరిస్తే ఎంతో మంచిదని భక్తుల నమ్మకం.
బృహస్పతి ఆయా రాశులలో ప్రవేశించినప్పుడు ఆయానదికి పుస్కరాలు వస్తాయి. బృహస్పతి ఆ రాశిలో ఉన్నంతకాలము ఆ నది పుష్కరములో ఉన్నట్టే.
పుష్కర కాలము సాధారణంగా ఒక సంవత్సరము పాటు ఉంటుంది. పుష్కరకాలములోని మొదటి పన్నెండు రోజులను ఆది పుష్కరం అని, చివరి పన్నెండు రోజులను అంత్య పుష్కరం అని వ్యవహరిస్తారు.
ఈ మొదటి, చివరి పన్నెండు రోజులు మరింత ప్రత్యేకమైనవి.
పుష్కర సమయంలో పిండ ప్రదానం
సాధారణంగా నదీ స్నానాలలో తర్పణం, పిండ ప్రదానం, శ్రాద్ధ కర్మలు చేసి పితరులను తృప్తి పరచి వారి ఆశీశ్శులు అందుకోవడం శుభప్రథమని విశ్వసిస్తారు.మొదటి రోజున హిరణ్య శ్రాద్ధం, తొమ్మిదవ రోజున అన్న శ్రాద్ధం, పన్నెండవ రోజున ఆమ శ్రాద్ధం చేయడం మంచిదని ఋషులు చెప్పారని పురాణాలు చెప్తున్నాయి.
పుష్కరకాల స్నానం
నీటిలో రెండు శక్తులున్నాయని వేదం చెప్తుంది. దాహార్తిని తీర్చడం, శుభ్రపరచడం అనే రెండు బాహ్య శక్తులైతే అంతరంగికంగా మేధ్యం, మార్జనం అనే శక్తులున్నాయని వేదం వివరిస్తుంది.
నీరు నారాయణ స్వరూపం కనుక ఆయన స్పర్శచే పాపాలు స్నానంద్వారా పటాపంచలు అవుతాయని విశ్వసిస్తారు.
తీర్ధ స్నానం ఉత్తమం దానికంటే నదీ స్థానం ఉత్తమం దానికంటే పుష్కర సమయ నదీస్నానం ఉత్తమోత్తమం.
ఆ సమయంలో దేవతలలంతా పుష్కరునితో నదిలో ప్రవేశీస్తారని హిందువుల విశ్వాసం.
త్రికరణాలతో చేసే పాపాలు పోతాయని, పుష్కర స్నానం ఒకసారి చేస్తే పన్నెండు సంవత్సరాల కాలం పన్నెండు పుణ్య నదులలో స్నానంచేసిన పుణ్యం లభిస్తుందని, అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం లభిస్తుందని ఋషి వాక్కు. మోక్షప్రాప్తి కలుగుతుందని బ్రహ్మాండ పురాణం వర్ణిస్తుంది.
నదీ జలాలను సేవిస్తే పాప ప్రక్షాళన జరుగుతుందని నదీ జలాలలో స్నానమాచరిస్తే మాంద్యం, అలసత్వం మొదలైన శారీరక రుగ్మతలు నశిస్తాయని తైత్తరీయ ఉపనిషత్తు వివరిస్తుంది.
ఇసుకతో కాని, మట్టితో కాని పార్థీవ శివలింగాన్ని చేసి పూజించాలంటారు.
నదీ తీరంలోని ఇసుకను నదిలోకి వేయాలంటారు. పురోహితులు భక్తుల తలపై మూడు దోసిళ్ల నీళ్లతో ఆశీస్సులు అందజేస్తారు.
ప్రతి నదిలో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరం జరుగుతుంది. ప్రతి నది ఒక రాశితో ముడిపడి ఉంటుంది మరియు ప్రతి సంవత్సరం పండుగకు సంబంధించిన నది ఆ సమయంలో బృహస్పతి ఏ రాశిలో ఉందో దానిపై ఆధారపడి ఉంటుంది.
నర్మదా పుష్కరం సాధారణంగా 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే నర్మదా నది పండుగ. ఈ పుష్కరాన్ని బృహస్పతి వృషభ రాశి (వృషభ రాశి)లోకి ప్రవేశించినప్పటి నుండి 12 రోజుల పాటు జరుపుకుంటారు.
ఈ సంవత్సరం నర్మదా పుష్కరలు 2024 మే 1 నుండి ప్రారంభం అయ్యి మే 12న ముగుస్తాయి.
అమర్కంటక్ ఆలయం, ఓంకారేశ్వర్ ఆలయం, చౌసత్ యోగిని ఆలయం, చౌబీస్ అవతార్ ఆలయం, మహేశ్వర్ మహేశ్వర్ ఆలయం, నెమవార్ సిద్ధేశ్వర్ మందిరం మరియు భోజ్పూర్ శివాలయం చాలా పురాతనమైనవి మరియు ప్రసిద్ధమైనవి.
పన్నెండు జ్యోతిర్లింగాలలో ఓంకారేశ్వర్ ఒకటి మరియు నరమదా నదిలో పవిత్ర స్నానం చేయడానికి అమ్రార్కంటక్ ఉత్తమమైన ప్రదేశాలు.
ఓంకారేశ్వర్లో నర్మదా నది ఒడ్డున అనేక అందమైన ఘాట్లు ఉన్నాయి
ఈ నది ప్రవాహం నిరంతరం మరియు స్థిరంగా ఉంటుంది మరియు నీరు చాలా స్వచ్ఛంగా ఉంటుంది.
ఘాట్లపై నది లోతు ఎక్కువగా ఉండదు. మరియు భక్తులు సులభంగా స్నానాలు చేయవచ్చు.
ప్రధాన ఆలయానికి ఎదురుగా ఉన్న కోటి తీర్థ ఘాట్ అన్ని ఘాట్లలో అత్యంత ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది.
ఇక్కడ స్నానం చేయడం వల్ల కోట్లాది తీర్థయాత్రల పుణ్యం లభిస్తుంది.