అమెరికా నిఘా సంస్థ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) తొలి చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (సీటీఓ)గా భారత సంతతికి చెందిన నంద్ మూల్చందానీ నియమితులయ్యారు. సీఐఏ డైరెక్టర్ విలియమ్ జె.బర్న్ ఓ బ్లాగ్ పోస్ట్ ద్వారా ప్రకటించారు.
ఐటీ నిపుణుడైన చందానీ సిలికాన్ వ్యాలీలో 25 ఏళ్లపాటు పనిచేశారు. డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్లోనూ సేవలందించారు.
ముల్చందనీ తన పాఠశాల విద్యను ఢిల్లీలో పూర్తి చేశారు. ఆయన 1979-87 మధ్య బ్లూబెల్స్ స్కూల్ ఇంటర్నేషనల్లో చదువుకున్నారు. కంప్యూటర్ సైన్స్, మ్యాథ్లో తన అండర్ గ్రాడ్యుయేట్ కోర్సు కోసం కార్నెల్ విశ్వవిద్యాలయానికి వెళ్ళారు. తర్వాత ఆయన స్టాన్ఫోర్డ్ నుంచి మేనేజ్మెంట్లో మాస్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని, అలాగే హార్వర్డ్ నుంచి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్ డిగ్రీని పొందారు.
CIAలో చేరడానికి ముందు, ముల్చందానీ ఇటీవల US డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ జాయింట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్కి యాక్టింగ్ డైరెక్టర్గా పనిచేశారు. సిలికాన్ వ్యాలీలో 25 సంవత్సరాల కంటే ఎక్కువ పనిచేసిన అనుభవంతోపటు ఆయన Oblix, Determina, OpenDNS, ScaleXtreme సహా అనేక విజయవంతమైన స్టార్టప్లకు కో-ఫౌండర్ గా, CEO గా పనిచేశారు.
సీఐఏలో స్థానం దక్కడాన్ని గర్వంగా భావిస్తున్నానని మూల్ చందానీ అన్నారు. అయితే ఆయన అనుభవం సీఐఏకి ఎంతో ఉపయోగపడుతుందని విలియం బర్న్ ఆశాభావం వ్యక్తం చేశారు.