నమో భారతం: విశ్వ విఖ్యాతం
మనసుంటే మార్గం ఉంటుంది. 2014 నుంచి బారత్ విషయంలో ఈ సంగతి ప్రపంచానికి తెలుస్తూనే ఉంది. ప్రపంచంలో అతిపెద్ద విగ్రహాన్ని గుజరాత్ లో ఏర్పాటు చేయాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్ణయించినప్పుడు కొందరు వ్యతిరేకించారు. విమర్శించారు. సర్దార్ పటేల్ విగ్రహం ఇప్పుడు గుజరాత్ లో అతిపెద్ద టూరిస్ట్ అట్రాక్షన్ గా మారింది. ఏటా లక్షల మంది టూరిస్టుల రాకతో ఆ ప్రాంతంలో ఆర్థిక స్థితిగతినే మార్చే స్థాయికి చేరింది. ప్రజలకు మౌలిక సదుపాయాలను కల్పించడంలోనూ మోడీ సర్కార్ ప్రపంచ రికార్డులను బద్దలు కొడుతూనే ఉంది.
హిమాచల్ ప్రదేశ్ లో ఇటీవల ప్రారంభించిన అటల్ టన్నెల్, ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం. ఈ భూమి మీద మరెక్కడా ఇంతపొడవైన టన్నెల్ లేదు.
ప్రపంచంలో అతి ఎత్తయిన వంతెన నిర్మాణం జమ్ము కశ్మీర్ లో జరిగింది. దాని పేరు చినాబ్ వంతెన. అంతేనా, ప్రపంచంలో అతి ఎత్తయిన పియర్ బ్రిడ్జి కూడా మనదేశంలోనే ఉంది. అదే ఇజాయి వంతెన. ఈశాన్యంలోని మణిపూర్ రాష్ట్రంలో ఉంది.
ఇక సరిహద్దుల్లో పదుల సంఖ్యలో సొరంగ మార్గాలు, హైవేలు ఇతర మౌలిక సదుపాయాల కల్పనలో మనం ఊహించనంత అభివృద్ధి జరిగింది. ఇంకా జరుగుతూ ఉంది. సైన్యం మెరుపు వేగంతో ఒక చోటి నుంచి ఇంకో చేటకు చేరుకునేలా రహదారులు, సాధన సంపత్తిని సమకూర్చడంలో మోడీ ప్రభుత్వం తన రికార్డులను తానే బద్దలు కొడుతోంది.