కేంద్ర ప్రభుత్వంలో తెలుగుదేశం పాత్ర కీలకం కాబోతోంది. బిజెపి తర్వాత ఎన్డీఏ కూటమిలో పెద్ద పార్టీగా తెలుగుదేశం నిలుస్తోంది. అంతేకాకుండా బలపరీక్షలో పార్లమెంట్లో తెలుగుదేశం పార్టీ మద్దతు చాలా చాలా అవసరం. దీనిని దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం పార్టీ కేంద్ర మంత్రి పదవులు అడిగే అవకాశం ఉందని అంటున్నారు.
టిడిపి ఎంపీలు కొంతమంది పేర్లు ఇప్పటికే చక్కర్లు కొడుతున్నాయి.
కేబినెట్ మంత్రిగా శ్రీకాకుళం ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు పేరు బాగా వినిపిస్తోంది. మూడుసార్లు ఎంపీగా ఉండటంతో పాటుగా పార్టీకి వినయ పూర్వక భక్తుడిగా పేరుంది. గతంలో కేంద్ర ప్రభుత్వంలో తెలుగుదేశం చేరినప్పుడు రామ్మోహన్ నాయుడు తండ్రి ఎర్రం నాయుడికి అవకాశం కల్పించారు. ఉత్తరాంధ్రలో తిరుగులేని నాయకుడిగా ఆయనకు పేరు ఉంది. గత పార్లమెంట్ హయాంలో ముగ్గురు తెలుగుదేశం ఎంపీలు ఉన్నప్పటికీ రామ్మోహన్ నాయుడు మాత్రమే టిడిపి తరఫున తిరిగి ఎన్నికయ్యారు మిగిలిన ఇద్దరు పార్టీకి దూరమయ్యారు.
ఇక,, సహాయ మంత్రులుగా. అమలాపురం ఎంపీ హరీష్ బాలయోగి, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్, హిందూపూర్ ఎంపీ పార్థసారధికి దక్కే అవకాశం కనిపిస్తోంది. సామాజిక వర్గ సమీకరణాల కోణంలో ఈ ఇద్దరు పేర్లు బలంగా వినిపిస్తున్నాయి.
విజయనగరం ఎంపీ అప్పలనాయుడు మెయిన్ స్ట్రీమ్ రాజకీయాలకు బాగా కొత్త. విశాఖ ఎంపీగా భరత్ ఉన్నప్పటికీ నారా లోకేష్ తోడల్లుడు కాబట్టి కుటుంబ పాలన విమర్శ వచ్చే అవకాశం ఉన్నందున దూరం పెట్టవచ్చు. ఇక ఉభయగోదావరి జిల్లాలో బిజెపి జనసేనకే ఎంపీ పదవులు దక్కాయి. ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి సీనియర్ అయినప్పటికీ లిక్కర్ స్కామ్ లో పేరు ఉన్నందున ఆయనకు అవకాశం రాక పోవచ్చు.
తెలుగుదేశం పార్టీ స్పీకర్ పదవి కోసం పట్టుపడుతోంది అని తెలుస్తోంది. కానీ ప్రస్తుత సమీకరణాల్లో స్పీకర్ ఇచ్చే అవకాశం కల్పించడం లేదు దానికి బదులు తెలుగుదేశానికి డిప్యూటీ స్పీకర్ పదవిని ఇచ్చే ఛాన్స్ ఉంది.