దేశ వ్యాప్తంగా ఒక్కసారిగా వార్తల్లోకెక్కిన మర్కజ్ మసీదు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గతేడాది ఈ మసీదులోనే తబ్లీగీ జమాత్ సమావేశాలు జరిగాయి. అయితే ఈ మసీదు కేంద్రంగా కరోనా సూపర్ స్ర్పైడర్గా మారింది. అయితే ఇప్పుడు ముస్లింల పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమవ్వడం.. ఇదే సమయంలో కరోనా మళ్లీ విజృంభిస్తుండటంతో ప్రభుత్వాలు సామూహిక ప్రార్ధనలపై ఆంక్షలు విధిస్తున్నాయి. ఈ క్రమంలో మర్కజ్ మసీదులో కేవలం 50 మంది మాత్రమే ప్రార్ధనలు చేసుకోవాలంటూ ఢిల్లీ హైకోర్టు అనుమతులిచ్చింది. నిజాముద్దీన్ మర్కజ్ మసీదులో ప్రతి రోజు ఐదు సార్లు నమాజ్ చేసుకునేందుకు అనుమతులిస్తూనే.. డిజాస్టర్ మేనేజ్మెంట్ నియమాలను ఖచ్చితంగా పాటించాలని సూచించింది.