నల్లమలలో కొలువైన మల్లన్న
దట్టమైన నల్లమల్ల అడువులలో వెలసిన అత్యంత పురాతన శైవ క్షేత్రం సలేశ్వరం . హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్ళే మార్గంలో దట్టమైన అడవి ప్రాంతంలో మన్ననూర్ నుంచి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో అడవి లోపల శివుడు కొలువై ఉన్నాడు.
దట్టమైన అరణ్యంలో ,చుట్టూ కొండలు, మధ్యలో సెలయేరుల నడుమ వెలసిన దివ్య క్షేత్రం సలేశ్వర క్షేత్రం . పై నుంచి పారే సెలయేటి నీటి తో స్నానమాచరించి స్వామి వారిని దర్శింకుంటారు భక్తులు . ఈ నీటి తో స్నానం చేస్తే సకల రోగాల నయమవుతాయని భక్తుల విశ్వాసం . ఈ క్షేత్రం లోనే మహాదేవుడు ఆర్జనుడి శౌర్య పరాక్రమాలు పరీక్షించాడని చెబుతారు.
ఈ క్షేత్రంలో స్వామి వారు లింగాకారం లో తేజోలింగస్వరుపుడిగా కొలువై ఉన్నాడు . ప్రాచీన కాలం నుంచి ఇక్కడ నివసించే చెంచులే ఆలయ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు . అరణ్యంలో దొరికే ఆకులు,అలములు,పండ్లు స్వామి వారికి నైవేద్యంగా సమర్పిస్తారు.స్వామి వారి సన్నిధికి చేరువలో వీరభద్ర స్వామి దేవాలయం,గంగమ్మ తల్లి ఆలయం ఉన్నాయి. .
ఆలయానికి చెరువులో పుట్ట ఉంది చైత్ర శుద్ధ త్రయోదశి నుంచి బహుళ తదియ వరకు స్వామి వారి వార్షికోత్సవాలు నిర్వహిస్తారు. చైత్ర శుద్ధ పౌర్ణమి నాడు వెన్నెల కాంతి స్వామి వారిపైన పడుతుంది. అందుకే ఆ రోజు స్వామి వారిని చూడటానికి చాలా మంది భక్తులు వస్తారు .
సాదారణ రోజుల్లో ఇక్కడికి వెళ్ళడానికి వీలు లేదు చైత్ర శుద్ధ పౌర్ణమి కి 5 రోజులు మాత్రమే వెళ్ళడానికి
సదుపాయాలు కల్పిస్తారు . జీవిత కాలంలో తప్పకుండ ఒక్కరి అయినా దర్శించాల్సిన క్షేత్రం ఇది .
సమీపంలో క్షేత్రం :-
మన్ననూర్ నుండి 50 మీ దూరంలో మల్లెలతీర్థం కొలువై ఉంది . 400 అడుగులు లోతులో ఎంతో రమణీయంగా ఉంటుంది
అర్జునుడు శివుడితో ఎందుకు యుద్ధం చేయాల్సి వచ్చిందో చెప్పే కథనం:
ధర్మరాజు ఇంద్రుడి దగ్గర ఉన్న అస్త్రాలను తీసుకురమ్మని చెప్పగా అర్జునుడు ఇంద్రలోకానికి వెళ్లి ఇంద్రుడిని అడుగుతాడు. అప్పుడు ఇంద్రుడు అర్జునుడితో నీవు శివుడిని ప్రసన్నం చేసుకోగలితే ఆ అస్త్రాలు నీకు ఇవ్వగలనని అంటాడు. ఇంద్రుడు చెప్పిన ప్రకారం అర్జునుడు ఇంద్రకీలా పర్వతాన్ని చేరి శివుడి కోసం తపస్సు చేస్తుంటాడు. అప్పుడు శివుడు అర్జునుడిని పరీక్షించాలని భావించి తానే స్వయంగా ఒక కిరాతకుడిగా మారి త్రిశూలాన్ని విల్లుగా మార్చుకొని మారువేషంలో వస్తాడు.మూకాసురుడిని ఒక పంది రూపంలో అర్జునుడి దగ్గరికి పంపగా, మూకాసురుడు అర్జునుడి తపస్సుని భగ్నం చేయడానికి చాలా విధాలుగా ప్రయత్నిస్తాడు. తపస్సు భంగం అవడంతో అర్జునుడు పంది రూపంలో ఉన్న మూకాసురుడి పైన బాణాలు వేస్తాడు. ఆ సమయంలోనే కిరాతకుడు రూపంలో ఉన్న శివుడు కూడా మూకాసురిడిపైన బాణాలు వేస్తాడు. అప్పుడు మూకాసురుడు చనిపోగా అది నేను వేసిన బాణాల వలెనే చనిపోయిందని కిరాతకుడి రూపంలో ఉన్న శివుడు అనగా, లేదు నేను వేసిన బాణాల వలనే అది చనిపోయిందని అర్జునుడు అంటాడు.
అప్పుడు కిరాతకుడు జంతువులను వేటాడేది మేము, దానిని చంపింది నేనే అంటూ వాదించగా అర్జునుడికి కోపం వస్తుంది. ఆ మాటలు కాస్త ఇద్దరి మధ్య యుద్దానికి దారి తీస్తాయి. అర్జునుడు శివుడితో యుద్ధానికి దిగి బాణాలను సందిస్తుండగా ఒక్క బాణం కూడా శివుడిని ఏమి చేయలేకపోతాయి. అప్పుడు శివుడు ఒకే ఒక్క బాణాన్ని అర్జునుడి పైకి సంధించగా ఆ దెబ్బకి అర్జునుడు కింద పడిపోతాడు. అయినా అర్జునుడు తన ఓటమిని అంగీకరించకుండా బాణాలను సంధించబోతుండగా ఒక్కసారిగా మూల్లోకాలన్నీ కంపిస్తాయి. నాలుగువైపులా ఘోర గాలులు వీస్తూ, భూ ప్రపంచం అంతా వినాశనం అవుతున్నట్టు కనిపించింది. ఆ సమయంలో అర్జునుడికి అర్ధం అవుతుంది అక్కడ ఉన్నదీ కిరాతకుడు కాదు ఆ రూపంలో ఉన్న శివుడు అని. తన తప్పు తెలుసుకొని శివుడు కాళ్ళమీద పడి క్షమించమని వేడుకుంటాడు. శివుడు చిరునవ్వుతో ఆశీర్వదించి, పాశుపతాస్త్రాన్ని ప్రసాదించి అదృశ్యమవుతాడు. ఇలా ఈ విధంగా శివుడు అర్జునుని అనుగ్రహించేందుకు ఒక పరీక్షను పెట్టి, కిరాతకుని రూపాన్ని ధరించాడు..ఇంతటి మహిమగల క్షేత్రాన్ని దర్శిస్తే పునీతులవుతారని పెద్దలు చెప్పేమాట.
Courtesy : గిరీష్