“నలందా యూనివర్సిటీ” మళ్ళీ సగర్వంగా అన్ని హంగులతో పురాతన కట్టడాలను తలపించే ఆకృతులతో శాశ్వత కట్టడాలలో పునఃప్రారంభం అవుతోంది.
నలంద యూనివర్శిటీని పునరుద్ధరించాలనే ఆలోచనను 2005లో అప్పటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం తొలిసారిగా ప్రతిపాదించారు. బీహార్లోని నలందా చారిత్రాత్మక విద్యా స్థలం శిథిలాల సమీపంలోనే ఈ విశ్వవిద్యాలయం నిర్మించబడుతోంది. 2007 లో దీనికి అమర్త్య సేన్ ని ఛాన్సలర్ గా ఈ ప్రాజెక్ట్లో 2014 వరకు ఉన్నారు. ఈ ప్రాజెక్ట్లో అనేక దేశాలు కూడా పాలు పంచుకుంటున్నాయి
జనవరి, 2007లో ఫిలిప్పీన్స్లో జరిగిన రెండవ తూర్పు ఆసియా సదస్సులో, ఆ తర్వాత థాయ్లాండ్లో జరిగిన నాల్గవ తూర్పు ఆసియా సదస్సులో నలంద విశ్వవిద్యాలయం పునః స్థాపన కోసం తీసుకున్న నిర్ణయాలను అమలు చేయడానికి భారత ప్రభుత్వం నలంద విశ్వవిద్యాలయ చట్టం, 2010ని రూపొందించింది. 2007లో ప్రాజెక్ట్ అమలు కోసం నలంద మెంటర్ గ్రూప్ (NMG) ఏర్పడింది. ఈ NMG పాలక మండలి విధులను నిర్వహిస్తోంది.
అయితే కాంగ్రెస్ మొదలుపెట్టే అన్ని ప్రాజెక్టుల లాగే ఇదీ నత్త నడక నడిచి తాత్కాలిక భవనాలలోనే తరగతులు మొదలగు కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి.
సెప్టెంబర్ 1, 2014న పురాతన నలంద నుండి కేవలం 10 కి.మీ దూరంలో ఉన్న బౌద్ధ యాత్రికుల పట్టణం రాజ్గిర్లోని ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లోని తాత్కాలిక వేదిక నుండి అకడమిక్ సెషన్ ప్రారంభమైంది.
యూపీఎ హయాంలో 2007 లో మొదలైన ప్రాజెక్ట్ 10 సం. ల వరకు శాశ్వత భవనాల నిర్మాణ పనులు జరగలేదు. మోదీ ప్రభుత్వం వచ్చాక వీటి నిర్మాణాలపై దృష్టి సారించారు.
2017 నుండి పని ప్రారంభించబడింది. పరిపాలనా, విద్యా పరంగా 90% పని పూర్తయింది. నాలుగు సంవత్సరాలలో ఇది రూపుదిద్దుకుంది. సంస్థ టేకాఫ్ చేయడానికి సిద్ధమవుతున్నందున, ప్రధానమంత్రి ఇక్కడకు వస్తే ఇది అతని లుక్-ఈస్ట్ పాలసీకి అనుగుణంగా ఉంటుంది” అని నలందా వైస్ ఛాన్సలర్ శ్రీమతి సునైనా సింగ్ అన్నారు. ఈమె మే 2017లో సంస్థలో చేరారు. దీని ప్రారంభోత్సవానికి సమయం ఇవ్వాలని ప్రధాని మోదీని మేం కొరనున్నాం అని వైస్ ఛాన్సలర్ చెప్పారు.
విశ్వవిద్యాలయంలో అద్భుతమైన మౌలిక సదుపాయాలు సిద్ధంగా ఉండటంతో, దాని విద్యా పనితీరు కూడా మెరుగుపడిందని, మరింత అభివృద్ధి చెందుతుందని వీసీ అన్నారు. “ఇప్పుడు మాకు ఆరు పాఠశాలలు ఉన్నాయి. సాధారణ కోర్సుల కోసం విద్యార్థులు సంఖ్య 250కి పైగా ఉంది, అయితే మేము నిర్వహిస్తున్న సర్టిఫికేట్, డిప్లొమా కోర్సుల కారణంగా మొత్తం 700-1000 మధ్య విద్యార్ధుల సంఖ్య ఉంటుంది అని చెప్పారు.
మేము ఇప్పుడే హిందూ స్టడీస్ (సనాతన)లో గ్లోబల్ మాస్టర్స్ ప్రోగ్రామ్ను ప్రారంభించాము, భారతదేశం నుండి మాత్రమే కాకుండా విదేశాల నుండి కూడా మంచి స్పందన వచ్చింది. 2014లో నలందా తన విద్యా కార్యక్రమాలను రెండు పాఠశాలలు, కేవలం 12 మంది విద్యార్థులతో ప్రారంభించింది. ఈ రోజు ఇంత దూరం చేరుకోవడానికి మేము చాలా కష్టపడ్డాం. కానీ ఇది ప్రారంభం మాత్రమే, ”అని వైస్ ఛాన్సలర్ తెలిపారు..
ఈమెచే అభివృద్ధి చేయబడిన హిందూ అధ్యయనాలలో రెండు సంవత్సరాల ఫుల్ టైం రెసిడెన్షియల్ M.A. ప్రోగ్రామ్. ఇది “హిందువుల యొక్క గొప్ప ఆధ్యాత్మిక, మేధో వ్యవస్థ – ఒక విలక్షణమైన ఇంటర్ డిసిప్లినరీ వ్యవస్థ”ని సంగ్రహిస్తుంది, దాని సారాంశం చెబుతుంది. ఇది సనాతన హిందూ అధ్యయనాలలో ఏదైనా స్ట్రీమ్లో స్పెషలైజేషన్ను అభివృద్ధి చేయడానికి అవకాశాన్ని అందిస్తుంది.
“దీనిని ప్రారంభించిన మొదటి విశ్వవిద్యాలయం మేము. అడ్మిషన్ ఇంకా కొనసాగుతోంది. యుఎస్, వియత్నాం, శ్రీలంక, బంగ్లాదేశ్ మొదలైన దేశాల నుండి విద్యార్థులు ఇప్పటికే నమోదు చేసుకున్నారు. ఇది గ్లోబల్ ప్రోగ్రాం’’ అని వీసీ అన్నారు.
ఇతర దేశాల నుండి అధ్యాపకుల తొలగింపుపై మాట్లాడుతూ “అధ్యాపకులు ఒకటి నుండి మూడు సంవత్సరాల వరకు కాంట్రాక్ట్లో నియమితులయ్యారు, అవసరం, వారి లభ్యతను బట్టి అది పొడిగించబడుతుంది. కొందరు తమ పదవీకాలం తర్వాత నిష్క్రమించడానికి ఇష్టపడవచ్చు. ప్రస్తుతం మాకు 48 మంది అధ్యాపకులు ఉన్నారు” అని ఆమె తెలిపారు.
మోదీని ఎవరు ఎలా తిట్టుకున్నా ఆయన కార్య దీక్షత, అనుకున్న పనిని సకాలంలో పూర్తి చేయించడం మెచ్చుకోవలసిందే. తను రాక ముందు మొదలు పెట్టిన ప్రోజెక్టులపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి అవి పూర్తి అయ్యే వరకు స్వయంగా మానిటర్ చేయడం ఆయన ప్రత్యేకత..
Courtesy :- Chada Shastry