
ఈ నెల మొదట్లో దత్త జయంతి వేడుకల సందర్భంగా ఈ గుడికి పెద్ద సంఖలో హిందూ భక్తులు వెళ్తారు అని, ఆ వెళ్లే దారిలో ఇనుప మేకులు వేశారు అని మహ్మద్ షాబాజ్, వాహిద్ హుస్సేన్ అనే ఇద్దరు వ్యక్తులను కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిద్దరూ కర్ణాటకలోని చిక్కమగళూరులోని అయ్యప్ప నగర్ లో ఉంటారు.

Mohammad Shabaz (left) and Wahid Hussain (right) have been arrested by the police.
డిసెంబర్ 6వ తేదీ దత్త జయంతి వుత్సవాల మొదటి రోజు ఈ యువకులు ఆ రోడ్డు మీద ఇనుప మేకులు వేయడంతో ఒక పోలీస్ వాహనంతో సహా 5 వాహనాలకు పంచర్లు అయ్యాయి. ఈ గుడికి పెద్ద సంఖ్యలో హిందూ భక్తులు రావడం చూసి అసూయ చెంది, హిందూ భక్తులను ఇబ్బందికి గురిచేయడానికి ఈ పని చేసినట్లు, దాని కోసం 4kgలు మేకులు కొన్నట్లు వారు ఇంటరాగేషన్ లో చెప్పారని పోలిసులు చెప్పారు.

కర్ణాటకలో హిందూ రాజుల కాలంలో ఉండే దేవాలయాల నిర్వహణా విభాగం టిప్పు సుల్తాన్ కాలంలో ముజరాయ్ విభాగంగా పేరు మారింది. సుమారు 35000 హిందూ దేవాలయాలు సంస్థలు ఈ ముజరాయీ అధీనంలో వున్నాయి.. కోర్టు డాక్యుమెంట్స్ ప్రకారం మైసూర్ రిలీజియస్ అండ్ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్ ఆక్ట్ 1927 కి చెందిన పెద్ద ముజరయి దేవాలయం ఈ దత్త పీఠం.
అయితే 1960లో కర్ణాటక ప్రభుత్వం ఈ దేవాలయాన్ని ముజ్రయి (హిందూ దేవాలయాల పర్యవేక్షణా సంస్థ) నుండి తప్పించి వక్ఫ్ బోర్డ్ కి బదిలీ చేసింది. 1975లో వక్ఫ్ బోర్డ్ దీనిని స్వాధీనం చేసుకుంటే, హిందూ ధర్మకర్తలు జిల్లా కోర్టులో కేసు వేస్తే, జిల్లా కోర్ట్ 1980లో ఇది వక్ఫ్ అస్తి కాదు అని తీర్పు చెప్పింది.
1991లో సుప్రీమ్ కోర్టు వక్ఫ్ వేసిన అపీల్ ని కూడా కొట్టి వేసింది. అయినా వివాదం ఇంకా నడుస్తూనే ఉంది.
….చాడా శాస్త్రి…..