తెలంగాణలో ఖాళీగా ఉన్న నాగార్జున సాగర్ నియోజకవర్గానికి కేంద్ర ఎన్నికల శాఖ మంగళవారం నాడు షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఈ నెల 23వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు పేర్కొంది. మార్చి 30వ తేదీ నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని.. 31వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుందని ఈసీ తెలిపింది. ఏప్రిల్ 3వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణ.. 17వ తేదీన పోలింగ్ జరుగనున్నట్లు పేర్కొంది. ఇక మే 2వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. అయితే నాగార్జున సాగర్తో పాటుగా.. తిరుపతి ఎంపీ స్థానానికి కూడా ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించింది. ఏప్రిల్ 17వ తేదీ రోజునే తిరుపతిలో కూడా బై పోల్ జరగనుంది. వీటితో పాటుగా.. కర్ణాటకలోని బెల్గాంతో పాటు.. దేశంలోని మరో 13 అసెంబ్లీ స్థానాలకు మంగళవారం నాడు ఈసీ ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసింది.