4 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతానికి మోగిన నగారా
దేశంలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తున్న వేళ.. ఎన్నికల కమిషన్ నాలుగు రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతానికి ఎన్నికల నగారా మోగించింది. వెస్ట్ బెంగాల్,అసోం, తమిళనాడు, కేరళ రాష్ట్రాలతో పాటుగా.. కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరికి కూడా ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసింది. అంతేకాదు.. పలు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న స్థానాలకు కూడా ఉప ఎన్నిక షెడ్యూల్ను ప్రకటించింది. సీఈవో సునీల్ అరోరా శుక్రవారం ఢిల్లీలో మీడియా సమావేశంలో ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేశారు.
వెస్ట్ బెంగాల్లో 294 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక అసోంలో 126 స్థానాలకు, తమిళనాడులో 234, కేరళలో 140 స్థానాలకు ఎన్నికలు జరగున్నాయి. వీటితో పాటుగానే పుదుచ్చేరిలోని 30 అసెంబ్లీ స్థానాలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి.