మూడు ఈశాన్య రాష్ట్రాల శాసన సభల ఎన్నికల షెడ్యూలును ఎన్నికల కమిషన్ . నాగాలాండ్, మేఘాలయ, త్రిపురలలో 60 శాసన సభ స్థానాలు చొప్పున ఉన్నాయి. త్రిపురలో ఫిబ్రవరి 16న ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. మేఘాలయ, నాగాలాండ్లో కూడా ఫిబ్రవరి 27న పోలింగ్ జరుగుతుందని తెలిపింది. ఈ మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మార్చి 2న వెలువడనున్నాయి. నాగాలాండ్ శాసన సభ పదవీ కాలం మార్చి 12తోనూ, మేఘాలయ అసెంబ్లీ టెర్మ్ మార్చి 15తోనూ, త్రిపుర శాసన సభ పదవీ కాలం మార్చి 22తోనూ ముగుస్తోంది. ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరిగేలా ప్రజలు సహకరించాలన్న సీఈసీ …ఫిర్యాదులను సీవిజిల్ యాప్ ద్వారా ఎన్నికల కమిషన్ (ECI)కి తెలియజేయవచ్చునన్నారు.