పద్యం హృద్యమైన భావాలను లయబద్ధమైన ఛందస్సుతో అల్లిన మాలిక. పద్యం తెలుగువారి సంపద, ఒక్క పద్యం కూడా నోటికి రాని తెలుగువారు ఉండరేమో ! అందుకే మన సాహిత్యంలో విశిష్టమైన స్థానం సంపాదించుకున్న పద్యానికి, పెద్దపీట వెయ్యాలని, పద్యాల పోటీలు నిర్వహించనున్నది “మైండ్ మీడియా.” ఈ పోటీలో అన్నివయసుల వారూ పాల్గొనవచ్చు.
ప్రధమ విజేత – 3,000 రూ.
ద్వితీయ విజేత – 2500 రూ.
తృతీయ విజేత – 1500 రూ.
కన్సలేషన్ ప్రైజ్ లు – 1000 (1000 x3= 3000) రూ.
పద్యాల పోటీల నిబంధనలు
- ఒకరు ఒక ఎంట్రీని మాత్రమే పోటీకి పంపాలి. మొత్తం 5 పద్యాల వరకు (ఏ ఛందస్సులో నైనా) పంపవచ్చు.
- పద్యాలు పూర్తిగా భారతీయతను ప్రతిబింబించేలా ఉండాలి.
- పద్యాల ఎంపిక విషయంలో తుదినిర్ణయం మాదే. దీనిపై ఎటువంటి వాదోపవాదాలు ఉండవు.
- పద్యాలు తమవే నని, ఇతరుల పద్యాలకు అనుకరణ, అనుసరణ కాదన్న హామీపత్రం జతచెయ్యాలి.
- ఏ పద్య ప్రక్రియను ఎంచుకున్నా, యతి, ప్రాస, ఛందస్సు వంటి నియమాలను తప్పనిసరిగా పాటించాలి. అవి లేని పద్యాలు పోటీకి అంగీకరించబడవు.
- పద్యాలు పంపాల్సిన ఈమెయిలు info@52.87.47.62
- మాకు చేరాల్సిన చివరి తేదీ…31-12-2015
1 Comments
UMADEVI BALLURI
వీని ఫలితాలు వచ్చాయా