తన సోదరి మాళవిక రాజకీయాల్లోకి వస్తున్నట్టు నటుడు సోనూసూద్ ప్రకటించాడు. వచ్చే ఏడాది జరిగే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో మాళవికా సూద్ పోటీ చేయనున్నారు. అయితే ఆమె ఏ రాజకీయ పార్టీలో చేరేదీ ఇంకా తెలియదు.
ప్రజలకు సేవ చేసేందుకు తన సోదరి సిద్ధంగా ఉందని మీడియా సమావేశంలో సోనూ చెప్పాడు. ఏ పార్టీ అనేది ఇంకా నిర్ణయించుకోలేదని… త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. అయితే తాను మాత్రం రాజకీయాల్లోకి రానని… తన సోదరి కోసమే పలువురు రాజకీయ నాయకులను కలుస్తున్నానని సోనూసూద్ అన్నారు. ఇటీవలే సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీని కలిశానన్నాడు. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, శిరోమణీ అకాళీదళ్ చీఫ్ సుఖ్ బీర్ సింగ్ బాదల్ నూ కలవబోతున్నట్టు చెప్పాడు. ఒక్కో పార్టీకి ఒక్కో సిద్ధాంతం ఉంటుందని…పార్టీ గురించి సరైన సమయంలో వెల్లడిస్తామనీ అన్నారు.
మాళవికా సూద్ మోగాలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. సామాజిక కార్యకర్తగా ఆమెకు గుర్తింపు ఉంది. తల్లిదండ్రుల పేరుతో సూద్ చారిటీ ఫౌండేషన్ ఏర్పాటు చేసి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆమె అక్కడి నుంచే పోటీలో ఉండవచ్చనే ప్రచారం మొదలైంది. ఇక కోవిడ్ సమయంలో సోనూసూద్ చేసిన సేవలకు దేశవ్యాప్తంగా ప్రశంసలు వచ్చాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పాఠశాల విద్యార్థుల కోసం “దేశ్ కా మెంటర్స్” కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్గా నియమించారు కూడా. అదే సమయంలో ఆయనపై పన్నుఎగవేసిన ఆరోపణలు వచ్చాయి. సూద్ 20 కోట్ల రూపాయలకు పైగా పన్ను ఎగవేశారంటూ….బర్లో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ ప్రకటనతో మూడు రోజుల పాటు సోనూసోద్ ఇళ్లల్లో ఐటీ సోదాలు చేసింది. నివాస స్థలాన్ని అనుమతి లేకుండా హోటల్ గా మార్చాటంపై ఆరోపణల్నీ ఆయన ఎదుర్కొన్నాడు.