ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ వంటి దేశాలలో హిందువుల భద్రత ముఖ్యమని, హిందువులు సురక్షితంగా ఉంటేనే ముస్లిములకు కూడా రక్షణ దొరుకుతుందని ఆయన వివరించారు. చరిత్రలోని కొన్ని సంఘటనాలను యోగి ఈ సందర్భంగా ఉదహరించారు.
ఉత్తర ప్రదేశ్ పరిపాలన మీద ఒక మీడియా సంస్థకు యోగి ఆదిత్యనాథ్ ఇంటర్వ్యూ ఇచ్చారు.వంద హిందూ కుటుంబాలలో ఒక ముస్లిం కుటుంబం అత్యంత సురక్షితంగా ఉంటోందని తెలిపారు. కానీ 100 ముస్లిం కుటుంబాలలో 50 మంది హిందువులు సురక్షితంగా ఉండగలరా? అని ఆయన ప్రశ్నించారు.
లేదని పేర్కొంటూ బంగ్లాదేశ్ దీనికి ఒక ఉదాహరణ అని ఆయన చెప్పారు. దీనికి ముందు, పాకిస్తాన్ ఒక ఉదాహరణ అని చెప్పారు. ఇక, ఆఫ్ఘనిస్తాన్లో ఏమి జరిగింది? పొగ వస్తే లేదా ఎవరైనా కొడితే, మనం కొట్టబడకముందే జాగ్రత్తగా ఉండాలి. దాని కోసం జాగ్రత్త తీసుకోవాలి అని వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా యూపీ పరిస్థితిని ఆయన విశ్లేషించారు. 2017లో బిజెపి అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాష్ట్రంలో మతపరమైన అల్లర్లు జరగలేదని ఆదిత్యనాథ్ గుర్తు చేశారు.
“ఉత్తరప్రదేశ్లో, ముస్లింలు అత్యంత సురక్షితమైనవారు. హిందువులు సురక్షితంగా ఉంటే, వారు కూడా సురక్షితంగా ఉంటారు. 2017కి ముందు యుపిలో అల్లర్లు జరిగితే, హిందూ దుకాణాలు కాలిపోతుంటే, ముస్లిం దుకాణాలు కూడా కాలిపోతున్నాయి. హిందూ ఇళ్ళు కాలిపోతుంటే, ముస్లిం ఇళ్ళు కూడా కాలిపోతున్నాయి. 2017 తర్వాత, అల్లర్లు ఆగిపోయాయి” అని ఆయన స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ప్రజలకు యోగి ఒక విన్నపం అందించారు. “నేను ఒక సాధారణ పౌరుడిని, ఉత్తరప్రదేశ్ పౌరుడిని. నేను అందరి ఆనందాన్ని కోరుకునే యోగిని. అందరి మద్దతు, అభివృద్ధిని నేను నమ్ముతాను” అని ఆయన చెప్పారు. సనాతన ధర్మం ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన మతమని, హిందూ పాలకులు ఇతరులపై ఆధిపత్యం స్థాపించిన ఉదాహరణలు ప్రపంచ చరిత్రలో లేవని ఆయన నొక్కి చెప్పారు.
సహజంగానే యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యల మీద సోషల్ మీడియాలో దుమారం రేగడం ఆనవాయితీ. అదే మాదిరిగా ఈసారి కూడా పెద్ద ఎత్తున దుమారం రేగింది.