మహ్మద్ ప్రవక్తను కించపరిచేలా వ్యాఖ్యానించిన నుపుర్ శర్మను అరెస్టు చేయాలంటూ దేశవ్యాప్తంగా ముస్లిం సంఘాల నిరసనలు ఊపందుకున్నాయి. కర్ణాటకలోనూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. దీంతో రాష్ట్రంలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. సీఎం ఆదేశాలమేరకు డీజీపీ ప్రవీణ్సూద్ జిల్లా ఎస్పీలను అప్రమత్తం చేశారు. ముందస్తు అనుమతులు తీసుకున్నవారు ప్రశాంతంగా నిరసనలు తెలిపేందుకు మాత్రమే అవకాశం మాత్రమే ఉందని… రెచ్చగొట్టేవారిపట్ల మాత్రం కఠినంగా వ్యవహరించాలని సీఎం ఆదేశించారు.
ఢిల్లీ సహా దేశంలోని పలు నగరాలలో శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థనల అనంతరం నిరసనలు చేపట్టారు. పలుచోట్ల హింసరేగడంతో కర్ణాటకలో ముందస్తుగా రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఇప్పటికే రాష్ట్రంలో హిజాబ్, అజాన్ వంటి వివాదాలు తలెత్తిన నేపథ్యంలో రాష్ట్ర యంత్రాంగం అప్రమత్తమైంది.
రాష్ట్రంలోని చిక్కమగళూరు, మంగళూరు తదితర ప్రాంతాల్లో ముస్లింలు నిరసన చేపట్టారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని సమస్యాత్మక ప్రాంతాలలో గట్టి భద్రతను ఏర్పాటు చేశామని డీజీపీ ప్రవీణ్సూద్ మీడియాకు తెలిపారు.