అసోం సీఎం హిమంత బిస్వా శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసోం జనాభాలో 35 శాతం ముస్లింలు ఇతర వర్గాల్లో మెదులుతున్న భయాల్ని పోగొట్టాలని కోరారు. ఇక్కడ మరో కశ్మీర్ పునరావృతం కాదని మాకు భరోసా ఇవ్వాలనీ అన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఇకపై వారు మైనారిటీలు కాబోరన్నారు హిమంత. అస్సాం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో గవర్నర్ ప్రసంగంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. “ఈ రోజు ముస్లిం సమాజానికి చెందిన ప్రజలు ప్రతిపక్ష నాయకులు, ఎమ్మెల్యేలు, సమాన అవకాశాలు, అధికారాన్ని కలిగి ఉన్నారు. కాబట్టి దానిని నిర్ధారించడం వారి కర్తవ్యం” అని వ్యాఖ్యానించారు. కశ్మీర్ ఫైల్స్ దేశవ్యాప్తంగా ప్రజాదరణ పొందుతున్న వేళ… ప్రసంగం సందర్భంగా…1990 నాటి కశ్మీరీల వలసల్ని ఆయన ప్రస్తావించారు. ‘ది కశ్మీర్ ఫైల్స్’లో చూపిన విధంగా అస్సాం మారుతుందేమో అని ఇతర వర్గాల్లో రేకెత్తుతున్న భయాలను తొలగించడం రాష్ట్రంలోని ముస్లింల కర్తవ్యం అని శర్మ గుర్తు చేశారు.
అసోం జనాభాలో ముస్లింలు 35 శాతం ఉన్నందున ఇక్కడ మైనారిటీలను రక్షించడం వారి కర్తవ్యమని… సామరస్యం అంటే టూ-వే ట్రాఫిక్ లాంటిదని చెప్పుకొచ్చారు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)